జిల్లాలో ఆహార కల్తీలు, తూకాల మోసాలు జరగడానికి వినియోగదారుల్లో అవగాహన, సరైన అధికారులు, సిబ్బందిలేకపోవటమే కారణం. మోసపోయిన వినియోగదారుడు ఫిర్యాదుచేసి కోర్టుకు వెళ్లి తీర్పు వచ్చేంతవరకు ఉండే ఓపిక ఉండట్లేదు. దీని కోసం మా వంతు అవగాహన కల్పిస్తున్నా వారిలో మార్పు రావట్లేదు. లీగల్ మెట్రాలజీలో జిల్లాకు అసిస్టెంట్ కంట్రోలర్, ఇద్దరు ఇనస్పెక్టర్లు మాత్రమే ఉన్నారు. కల్తీలు పట్టుకొని నిర్ధారించేందుకు ప్రయోగశాల ల్యాబ్ రాష్ట్రంలో లేకపోవటం దురదృష్టకరం. ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ విభాగ అధికారులు కలిసి కల్తీలను పరిశీలిస్తే బాగుంటుంది.
–పిల్లి యజ్ఞనారాయణ, పల్నాడు జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్, నరసరావుపేట