ఏపీఐఐసీ భూముల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఏపీఐఐసీ భూముల పరిశీలన

Mar 14 2025 1:38 AM | Updated on Mar 14 2025 1:39 AM

నరసరావుపేట రూరల్‌: మండలంలోని కేసానుపల్లి సమీపంలోని ఏపీఐఐసీ భూములను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ గనోరే, ఆర్డీఓ మధులతలు గురువారం పరిశీలించారు. నరసరావుపేట నియోజకవర్గానికి మంజూరైన కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం అధికారులు ఈ భూముల పరశీలన జరిపారు. ఈ భూములను గత ప్రభుత్వ హాయాంలో ఆటోనగర్‌కు కేటాయించిన విషయం విధితమే. ఆటోనగర్‌ ఏర్పాటుకు శంకుస్థాపన కూడా చేశారు. ఆటోనగర్‌కు కేటాయించగా మిగిలిన భూముల్లో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. కేంద్రీయ విద్యాలయం రొంపిచర్లలో ఏర్పాటుచేయాలని మొదట భావించారు. తాజాగా కేసానుపల్లిలోని ఆటోనగర్‌కు కేటాయించిన భూములను కూడా పరిగణలోకి తీసుకొన్నారు. ఈ భూముల పై నుంచి హైటెన్షన్‌ వైర్లు వెళ్లడం, ప్రధాన రోడ్డుకు కిలోన్నర మీటరు దూరం ఉండటం వంటి వాటిని అధికారులు గుర్తించారు. దీనిపై నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement