వైఎస్సార్‌ సీపీ డాక్టర్స్‌ విభాగం జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్‌ కామిరెడ్డి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ డాక్టర్స్‌ విభాగం జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్‌ కామిరెడ్డి

Mar 14 2025 1:38 AM | Updated on Mar 14 2025 1:37 AM

నరసరావుపేట: వైఎస్సార్‌ సీపీ పల్నాడు జిల్లా డాక్టర్ల విభాగం అధ్యక్షుడిగా డాక్టర్‌ కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. కాగా, గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా శ్రీనివాసరెడ్డి వ్యవహరించారు.

1,41,244 మిర్చి బస్తాలు విక్రయం

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్‌ యార్డుకు గురువారం 1,28,725 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్‌ విధానం ద్వారా 1,41,244 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్‌ ఏసీ కామన్‌ రకం 334, నంబర్‌–5, 273, 341, 4884, సూపర్‌–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,500 వరకు పలికింది. నాన్‌ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్‌ రకాలకు సగటు ధర రూ.10,000 నుంచి రూ.14,000 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చి రూ.5,000 నుంచి రూ.7,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 56,214 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు.

కిడ్నీ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

కిడ్నీ డే సందర్భంగా ఎయిమ్స్‌లో వాకథాన్‌

మంగళగిరి: కిడ్నీ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఆల్‌ ఇండియా మెడికల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అహెంతమ్‌ శాంతా సింగ్‌ తెలిపారు. అంతర్జాతీయ కిడ్నీ డే సందర్భంగా గురువారం ఉదయం ఎయిమ్స్‌లో వైద్యులు, మెడికల్‌ విద్యార్థులతో వాకథాన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ శాంతా సింగ్‌ మాట్లాడుతూ కిడ్నీ అనారోగ్యం బారిన పడితే ఆ ప్రభావం శరీరంలోని ప్రతి అవయంపైనా పడుతుందన్నారు. కిడ్నీలను కాపాడుకోవడంలో అప్రమత్తంగా ఉంటే ఆరోగ్యంగా జీవించవచ్చని పేర్కొన్నారు. నేటి ఆధునిక సమాజంలో కిడ్నీల విక్రయాలు జరగడం దారుణమన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్‌ శ్రీమంత కుమార్‌ దాస్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ హెచ్‌ఓడీ డాక్టర్‌ ఉత్తర దాస్‌, మెడికల్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

తెనాలిలో ముగిసిన

ప్రత్యేక సదరం క్యాంప్‌

తెనాలిఅర్బన్‌: వికలాంగుల ధ్రువపత్రాలను పునఃపరిశీలన జరిపే కార్యక్రమంలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదరం క్యాంప్‌ గురువారంతో ముగిసింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సదరం క్యాంప్‌ను అధికారులు నిర్వహించారు. ఈఎన్‌టీ, అఫ్తమాలజీ, ఆర్ధోపెడిక్‌, సైక్రాటిక్‌ విభాగాలకు చెందిన వికలాంగులకు వైద్య పరీక్షలు చేశారు. క్యాంప్‌లో పలు ప్రభుత్వ వైద్యశాలకు చెందిన వైద్యులు పరీక్షలు నిర్వహించారు. క్యాంప్‌ను వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సౌభాగ్యవాణి పర్యవేక్షించారు.

వైఎస్సార్‌ సీపీ డాక్టర్స్‌ విభాగం జిల్లా అధ్యక్షుడిగా డ1
1/3

వైఎస్సార్‌ సీపీ డాక్టర్స్‌ విభాగం జిల్లా అధ్యక్షుడిగా డ

వైఎస్సార్‌ సీపీ డాక్టర్స్‌ విభాగం జిల్లా అధ్యక్షుడిగా డ2
2/3

వైఎస్సార్‌ సీపీ డాక్టర్స్‌ విభాగం జిల్లా అధ్యక్షుడిగా డ

వైఎస్సార్‌ సీపీ డాక్టర్స్‌ విభాగం జిల్లా అధ్యక్షుడిగా డ3
3/3

వైఎస్సార్‌ సీపీ డాక్టర్స్‌ విభాగం జిల్లా అధ్యక్షుడిగా డ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement