పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Mar 13 2025 11:46 AM | Updated on Mar 13 2025 11:42 AM

గురువారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2025
వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో యువత పోరు

ఇఫ్తార్‌ సహర్‌

(గురు) (శుక్ర)

నరసరావుపేట 6.25 5.03

గుంటూరు 6.23 5.01

బాపట్ల 6.23 5.01

కొలువు కలలు కల్లలవగా.. భృతి భ్రాంతిగా మారగా.. భవిష్యత్తు అంధకారంగా గోచరించగా.. దగా పడ్డ నిరుద్యోగి కూటమి ప్రభుత్వంపై గళమెత్తాడు. ఉద్యో‘గాలం’ వేసి పీఠమెక్కిన నేతలు ఇదిగో.. అదిగో అంటూ ఊరించి ఉసూరుమనిపించగా.. ఎన్నో ఆశలు.. మరెన్నో ఆకాంక్షలతో వేలకు వేలు కట్టి కోచింగ్‌ తీసుకుంటున్న యువత ఆక్రోశం కట్టలు తెంచుకుని వీధుల్లో నినాదమై పలికింది. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లు నిశ్చింతగా, నిబ్బరంగా ఫీజుల విషయమై గాబరా లేక చదువుపై దృష్టిపెట్టగా.. నేడు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాక.. ఎప్పుడు చెల్లిస్తారో తెలీక.. కళాశాల యాజమాన్యాల అనుమానపు చూపులు.. అవమానపు మాటలు తట్టుకోలేక అత్యంత ఒత్తిడితో చదువు బండి లాగిస్తున్న విద్యార్థులు సెమిస్టరు దాటిపోయినా ఒక్క రూపాయి ఫీజు కూడా చెల్లించని సర్కారు తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో జరిగిన యువత పోరులో పెద్ద ఎత్తున నిరుద్యోగులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. హామీలు నెరవేర్చేవరకు పోరుబాట సాగిస్తామని హెచ్చరించారు.

వైద్యవిద్యను వ్యాపారం చేసే కుట్ర...

7

పేద విద్యార్థులపై కక్ష సాధింపు

ఉన్నత విద్య అభ్యసిస్తున్న పేద విద్యార్థులపై కక్ష సాధింపులో భాగంగానే కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయడం లేదు. దివంగత వైఎస్సార్‌ ప్రారంభించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా పేద వర్గాల నుంచి ఎంతో మంది డాక్టర్లు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు అయ్యారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కొనసాగిస్తూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ విద్యాదీవన, వసతి దీవెన పథకాలను సైతం అమలు చేశారు. కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులను రోడ్డుపై నిలబెట్టే పరిస్థితికి తీసుకువచ్చింది. తక్షణం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు, బకాయిలు విడుదల చేయాలి. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని వెంటనే అందించాలి.

– పిన్నెల్లి రామకృష్ణారెడ్డి,

వైఎస్సార్‌ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు

పార్టీ జిల్లా కార్యాలయం నుంచి పల్నాడు జిల్లా కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ భారీగా హాజరైన విద్యార్థులు, నిరుద్యోగులు, వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టిన నేతలు యువత పక్షాన నిరంతర పోరాటాలు చేసి అండగా నిలుస్తామని భరోసా ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్‌ ర్యాలీ నేపథ్యంలో భారీగా మోహరించిన పోలీసులు జేసీ సూరజ్‌కి వినతిపత్రం అందజేత

న్యూస్‌రీల్‌

పల్నాడు1
1/5

పల్నాడు

పల్నాడు2
2/5

పల్నాడు

పల్నాడు3
3/5

పల్నాడు

పల్నాడు4
4/5

పల్నాడు

పల్నాడు5
5/5

పల్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement