
నరసరావుపేట రూరల్: మాదకద్రవ్యాలపై యువత అప్రమత్తంగా ఉండి వీటికి దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి కోరారు. నరసరావుపేట ఇంజినీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంపై అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, జిల్లా ఎస్పీ వై.రవిశంకర్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలో 144 దేశాల్లో మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారని తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగం మెట్రోపాలిటీ నగరాల నుంచి అన్ని పట్టణాలకు విస్తరిస్తుందన్నారు. జిల్లా ఎస్పీ రవిశంకర్రెడ్డి మాట్లాడుతూ యువత కొత్త పరిచయాల ద్వారా చెడు వ్యసనాలకు దగ్గరవుతారని తెలిపారు. డ్రగ్స్ వంటి మత్తుపదార్థాలకు బానిసలై దొంగతనాలు, చైన్స్నాచింగ్ ఇతర నేరాలకు పాల్పాడుతున్నారని తెలిపారు. డ్రగ్స్ వాడకం వలన ఆరోగ్యపరంగా, ఆర్థికంగా త్రీవంగా నష్టపోతారని తెలిపారు. యువత భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని మాదక ద్రవ్యాలను పూర్తీగా తుదిముట్టించాలన్నారు. డ్రగ్స్ విక్రయించేవారు, రవాణా చేసేవారు, వినియోగించేవారిపై పూర్తిగా నిఘా ఉంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ మిట్టపల్లి వెంకటకోటేశ్వరరావు, కళాశాల కార్యదర్శి మిట్టపల్లి రమేష్బాబు, ఎస్ఈబీ ఈఎస్ చంద్రశేఖరరెడ్డి, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఎస్ఈబీ ఏఈఎస్ దుర్గాప్రసాద్, డీఎస్పీ కేవీ మహేష్, రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.శ్రీనివాసకుమార్ పాల్గొన్నారు.
నెడ్క్యాప్ ఎలక్ట్రికల్ బైక్ల ప్రదర్శన
నరసరావుపేట: జిల్లాలో వాయు, శబ్ధ కాలుష్య నియంత్రణకు విద్యుత్ వాహనాలు దోహదం చేస్తాయని జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో న్యూ అండ్ రీయూజబుల్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ (ఎన్ఆర్ఇడీసీఏపీ) సంస్థ ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ ద్విచక వాహనాల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ రిబ్బన్ కట్చేసి ప్రారంభించారు. విద్యుత్ ద్విచక్రవాహనాల చార్జింగ్ వివరాలను తెలుసుకున్నారు. ఒక వాహనంపై ఎక్కి టెస్టింగ్ డ్రైవింగ్ చేశారు. నెడ్క్యాప్ గుంటూరు ఉమ్మడి జిల్లా అధికారి వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు మొదటి ఈఎంఐ మాత్రమే చెల్లించి వాహనాల కొనుగోలు చేయవచ్చన్నారు. తక్కిన మొత్తం ఈఎంఐల రూపంలో నెలనెలా చెల్లించవచ్చన్నారు. తమ నెడ్ క్యాప్ పోర్టల్ http://evnredcap.in ద్వారా వాహనం ఖరీదు చేస్తే బ్యాంకు వడ్డీరేటు కూడా తగ్గుతుందన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ 0863–2350114, 98498 53818 సంప్రదించాలని కోరారు.
జిల్లా కలెక్టర్ శివశంకర్
