● ఒకరి మృతి
● మరొకరికి తీవ్రగాయాలు
భువనేశ్వర్: ఢెంకనాల్ జిల్లా హల్దియాబహాల్ 55వ నంబర్ జాతీయ రహదారిపై నిలిచి ఉన్న ట్రక్కును శనివారం అంబులెనన్స్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్న్స్ సిబ్బంది ఒకరు మృతి చెందారు. డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని ఆస్పత్రిలో చేర్చారు. భువనేశ్వర్లో ఓ రోగిని దింపి అంగుల్ ప్రాంతానికి అంబులెన్స్ తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మోటంగా ఠాణా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం పంపించారు.


