
డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమిస్తాం
కొరాపుట్: తమ డిమాండ్లు ప్రభుత్వం ఆమోదించకపోతే ఉద్యమ బాట పడతామని ఒడిశా రెవెన్యూ మినిస్ట్రియల్ ఉద్యోగులు ప్రకటించారు. సోమవా రం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతి బాలాజీ సా హు నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలో ఈ విషయాన్ని ప్రకటించారు. జిల్లా స్థాయి రెవెన్యూ అధికారుల జీతాలు పెంచాలన్నారు. ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు రూ.20 లక్ష ల బీమా ఏర్పాటు చేయాలన్నారు. విధి నిర్వహణ లో మరణించిన ఉద్యోగి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం చేపట్టాలన్నారు. కొత్త పెన్షన్ పథకం రద్దు చేసి పాత పెన్షన్ పథకం అమలు చేయాలన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకపోతే జులై 7 నుంచి 11వ తేదీ వరకు నల్ల బ్యాడ్జిలతో విధులకు హాజరవుతామన్నారు. జులై 14వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొంటామన్నారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు లోకే శ్వర్ సాహు, ప్రసన్న కుమార్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.