
జయపూర్లో యువ ట్రైనీ ఓఏఎస్ల పర్యటన
కొరాపుట్: యువ ట్రైనీ ఒడిశా అడ్మిస్ట్రేటివ్ సర్వీస్ అధికారులు జయపూర్ పట్టణంలో క్షేత్ర పర్యటన చేశారు. సోమవారం మెయిన్ రోడ్డులో బంకు మఠం సమీపంలో గల బాబా సాహెబ్ కల్యాణ మండపంలో జరిగిన పీఎంఏవై, మధుబాబు పింఛన్ యోజన పథకాల లబ్ధిదారులకు వర్క్ ఆర్డర్ల పంపిణీ కార్యాక్రమానికి హాజరయ్యారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన జయపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి సమావేశమయ్యారు. ఈ పర్యటనలో 20 మంది ట్రైనీ యువ అధికారులు పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ ఆకవరం సస్య రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నరేంద్ర మహంతి, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. మరోవైపు ఈ కార్యక్రమాన్ని ప్రతిపక్ష బీజేడీ సభ్యులు బహిష్కరించారు. మొత్తం 28 మంది వార్డులు ఉన్న మున్సిపాలిటీలో 15 మంది బీజేడీ కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ బి.సునీత హాజరుకాలేదు. పెన్షన్ విభాగంలో పని చేస్తున ఒక ఉద్యోగి కౌన్సిలర్లపై నిర్లక్ష్యం వహిస్తున్నారని వివాదం జరుగుతుంది. సదరు ఉద్యోగి పట్ల చర్యలు తీసుకోవాలని బీజేడీ కౌన్సిలర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం పరిష్కారం కాకుండా పెన్షన్లు పంపిణీ చేయడం పట్ల ఆగ్రహంతో బీజేడీ కౌన్సిలర్లు బహిష్కరించారు.

జయపూర్లో యువ ట్రైనీ ఓఏఎస్ల పర్యటన