
కూలిన భారీ చెట్టు
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కోరుకొండ సమితి మూడురోడ్ల కూడలి వద్ద ఉన్న భారీ చింత చెట్టు సోమవారం తేల్లవారి జామున ఇదురుగాలులకు పడిపోయింది. చెట్టు విద్యుత్ స్తంభంపై పడింది. సమీపంలో ఉన్న ఓ ఇంటి గోడను తాకింది. ఇంటిలో నివసిస్తున్న వారు అంతా బయటకు వచ్చేశారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. వెంటనే విద్యుత్ కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో విద్యుత్ను నిలిపివేశారు. అగ్నిమాపిక బృందానికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ స్టేషన్ అధికారి సునీల్ నాయక్ పర్యవేక్షణలో చెట్టును తొలగించారు సుమారు ఐదు గంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి.
చెరువులో మునిగి మహిళ మృతి
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి ఎం.వి 79 పోలీసుస్టేషన్ పరిధిలో తాండబాయిలో సోమవారం గ్రామానికి చెందిన శింగేసాంధి (31) దుస్తులు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్లింది. వర్షం వల్ల బురదగా ఉండటంతో కాలు జారి చెరువులో పడిపోయింది. ఆమె ఇంటికి ఎప్పటికీ రాకపోవడంతో భర్త గ్రామంలో ఆరా తీశాడు. ఆమె చెరువు వద్దకు వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. చెరువు వద్దకు వెళ్లి చూ స్తే ఆమె చీర నీటిలో తేలుతూ కనిపించింది. వెంటనే గ్రామ సర్పంచ్కు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమెను బయటకు తీశారు. అప్పటికే మృతిచెందింది. పోలీస్ స్టేషన్ ఐఐసీ కృష్ణచంద్ర తండి సంఘటన స్థలానికి వెళ్లారు. మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశా రు. పోస్టుమార్టం కోసం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మృతదేహాన్ని కూటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.
విజిలెన్స్ వలలో సీడీపీఓ, క్లర్క్లు
రాయగడ: జిల్లాలోని బిసంకటక్ లో గల ఐసీడీఎస్ కార్యాలయంలో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అధికారి (సిడిపిఒ) సుశీల సబర్, క్లర్క్ గా విధులు నిర్వహిస్తున్న రామచంద్ర పాత్రో లు సొమవారం విజిలెన్స్ వలలో చిక్కుకున్నా రు. సమితిలోని చాటికొన పంచాయతీలోని హుతేషి గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్న సీత వడక నుంచి రూ.80 వేలు లంచంగా తీసుకుంటూ ఉండగా విజిలెన్స్ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అంగన్వాడీ కార్యకర్తల నియమకానికి సంబంధించి హుతేషి గ్రామానికి చెందిన ముగ్గురు దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఒకరి నుంచి వీరిద్దరూ లంచం డిమాండ్ చేశా రు. ఆమె రూ.20వేలు ఇచ్చారు. మరో రూ.80 వేల కోసం వేధించడంతో ఆమె విజిలెన్స్ను ఆశ్రయించింది. దీంతో విజిలెన్స్ అధికారులు వల వేసి పట్టుకున్నారు.
రాష్ట్ర అధ్యక్షుడిగా కిల్లాన
శ్రీకాకుళం: జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడిగా కిల్లాన శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు జాతీ య బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ సోమవారం నియామక ఉత్తర్వులు అందించారు. శ్రీనివాసరావు గత ఐదేళ్లుగా బీసీ సంఘంలో పనిచేస్తూ సంఘ అభివృద్ధికి, పటిష్టతకు కృషి చేశారు.

కూలిన భారీ చెట్టు

కూలిన భారీ చెట్టు

కూలిన భారీ చెట్టు