
శ్యాంప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు
పర్లాకిమిడి: బహుముఖ ప్రతిభాశాలి, అసాధారణ వ్యక్తి డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ను స్థానిక రాజవీధిలోని విశ్వనాథ్ మండపంలో బీజేపీ శ్రేణులు సోమవారం జరుపుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు నవకిశోర్ శోబోరో ముఖర్తీ చిత్రపటానికి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ కేవలం 33 ఏళ్లకే కోల్కోతా వర్విటీలో ఉపకులపతిగా పనిచేశారన్నారు. అప్పటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ క్యాబినేట్లో పనిచేసిన ముఖర్జీ జమ్ము, కశ్మీర్లో ఆర్టికల్ 370 వ్యతిరేకించారని అన్నారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఛిత్రి సింహాద్రి, కాశీనగర్ నాయకులు రొక్కం రాంప్రసా ద్, ఎంపీప్రతినిధి దారపు రాజేష్ కుమార్, రొక్కం సతీష్, ఎస్.శేషగిరిరావు (గుమ్మ) పాల్గొన్నారు.
గ్రీవెన్స్సెల్కు 22 వినతులు
పర్లాకిమిడి: కాశీనగర్ సమితి కిడిగాం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన జాయింట్ గ్రీవెన్ సెల్కు అధిక స్పందన లభించింది. గ్రీవెన్స్కు జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్, జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, జిల్లా పరిషత్ ముఖ్యకార్య నిర్వాహణాధికారి శంకర కెరకెటా, సబ్ కలెక్టర్ అనుప్ పండా, కాశీనగర్ సమితి చైర్మన్ బల్ల శాయమ్మ పాల్గొన్నారు. కాశీనగర్ సమితిలో గోరిబంద, హడ్డుబంగి, శియ్యాళి, కిడిగాం గ్రామాల నుంచి 22 వినతులు అందాయి. వాటిలో తొమ్మిది వ్యక్తిగతం, 13 గ్రామసమస్యలకు సంబంధించినవి ఉన్నాయి. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ కాశీనగర్ బి.డి.ఓ.డంబుధర మల్లిక్కు ఆదేశించారు. గ్రీవెన్సుకు కాశీనగర్ తాహసీల్దార్, సీడీఎంవో డాక్టర్ ఎం.ఎం.ఆలీ, డీఎస్.యస్.ఓ. సంతోష్ కుమార్ నాయక్ ఉన్నారు.
గోపాల్పూర్ అత్యాచారం సంఘటనపై తాఖీదులు జారీ
భువనేశ్వర్: గంజాం జిల్లా గోపాల్పూర్లో మహిళా కళాశాల విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం సంఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్వయంగా చొరవ తీసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రఽముఖ కార్యదర్శి మరియు పోలీస్ డైరెక్టర్ జనరల్కు సోమవారం తాఖీదుల జారీ చేసింది. 2 వారాల్లోగా ఈ అధికారులు వివరణాత్మక నివేదిక దాఖలు చేయాలని గడువు ఇచ్చింది.
వెబ్ పోర్టల్ ప్రారంభం
భువనేశ్వర్: రాష్ట్రంలో పిల్లల సంక్షేమం, పిల్లల పోషణ, పిల్లల రక్షణ రంగాల పని శైలి మెరుగుపరిచేందుకు మహిళ, శిశు అభివృద్ధి శాఖ బాధ్యతలు వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి, ప్రభాతి పరిడా శిశు వెబ్పోర్టల్ను సోమవారం ప్రారంభించారు. ఈ పో ర్టల్ ద్వారా పిల్లల ఆరోగ్యం, పోషకాహారాన్ని కచ్చితంగా తెలుసుకునేందుకు వీలవుతుంది. ఈ వెబ్ పోర్టల్ శిశు పౌష్టికత, చైల్డ్ హెల్ప్లైన్ నంబర్ 10 98ను సమన్వయం చేస్తుంది. మిషన్ వాత్సల్య, య శోద, దీక్ష వంటి పథకాల నవీకరించిన సమా చా రాన్ని ఈ పోర్టల్ ప్రజలకు తెలియజేస్తుంది.