అలరనాథుని దర్శించుకున్న ముఖ్యమంత్రి | - | Sakshi
Sakshi News home page

అలరనాథుని దర్శించుకున్న ముఖ్యమంత్రి

Jun 23 2025 5:34 AM | Updated on Jun 23 2025 5:34 AM

అలరనా

అలరనాథుని దర్శించుకున్న ముఖ్యమంత్రి

భువనేశ్వర్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ ఆదివారం బ్రహ్మగిరిలోని అలర్‌నాథ్‌ స్వామిని దర్శించుకున్నారు. స్వామి ఆశీస్సులు సంపన్నమైన ఒడిశా లక్ష్యాన్ని సాధించడానికి బలాన్ని ఇస్తాయన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఈ ఆలయాన్ని సందర్శించడం ఇదే తొలిసారి.

జంఝావతి వంతెనపై

రెండు వాహనాలు ఢీ

రాయగడ: స్థానిక మజ్జిగౌరి మందిరం సమీపంలో గల జంఝావతి నది వంతెన మలుపు వద్ద ఆదివారం రెండు వాహనాలు ఢీకొన్నా యి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి బొగ్గు లోడుతో చత్తీస్‌గఢ్‌ వైపు వెళ్తున్న టిప్పర్‌, వత్తాడ నుంచి రాయగడకు మరమ్మతు కోసం వెళ్తున్న పికప్‌ వ్యాన్‌లు వంతెన మలుపు వద్ద ఢీకొనడంతో డీజిల్‌ ట్యాంక్‌ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగి రెండు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే పికప్‌ వ్యాన్‌, టిప్పర్‌ డ్రైవర్లు వాహనాల నుంచి గెంతేసి ప్రాణాలు కాపాడుకోగలిగారు. అయితే టిప్పర్‌లో హెల్పర్‌గా పనిచేస్తున్న వత్తాడ గ్రామానికి చెందిన పలక రమేష్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రెండు వాహనాలు ఒకేసారి వెళ్తున్న సమయంలో మలుపు వద్ద టిప్పర్‌ అత్యంత వేగంగా నడపడంతో వెనుక నున్న వ్యాన్‌ను ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు మలుపు వద్ద ఇరుక్కుపొయాయి. అనంతరం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే కొంత సమయం రాయగడ మీదుగా ఆంధ్రవైపునకు వెళ్లేందుకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు చొరవ తీసుకుని వాహనాలను పక్కకు నెట్టించి రాకపోకలను పునరుద్ధరించారు.

నవీన్‌ శస్త్ర చికిత్స విజయవంతం

భువనేశ్వర్‌: రాష్ట్ర విపక్ష నేత, బిజూ జనతా దళ్‌ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌ ఆరోగ్యం కోలుకుంటుంది. ముంబైలో ఆదివారం నిర్వహించిన శస్త్ర చికిత్స విజయవంతమైందని ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్‌ రమాకాంత పండా తెలిపారు. అందరితో సహజంగా మాటామంతీ చేస్తున్నారు. వైద్యపరమైన పరిశీలన కోసం ఆస్పత్రిలో ఉన్నారు. 5, 6 రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారన్నారు. ప్రియతమ నాయకుడు త్వరగా ఆరోగ్యంతో కోలుకోవాలని బీజేడీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక దీపారాధన కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా పూరీ జిల్లా బ్రహ్మగిరి నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ దాస్‌బర్మ ఆధ్వర్యంలో స్థానిక అలరనాథ స్వామి దేవస్థానం ఆవరణలో సామూహిక దీపారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నవీన్‌ పట్నాయక్‌ అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అలరనాథుని దర్శించుకున్న ముఖ్యమంత్రి 1
1/3

అలరనాథుని దర్శించుకున్న ముఖ్యమంత్రి

అలరనాథుని దర్శించుకున్న ముఖ్యమంత్రి 2
2/3

అలరనాథుని దర్శించుకున్న ముఖ్యమంత్రి

అలరనాథుని దర్శించుకున్న ముఖ్యమంత్రి 3
3/3

అలరనాథుని దర్శించుకున్న ముఖ్యమంత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement