
ధాన్యం కొనుగోలు చేయాలి
జయపురం: మండీలకు రైతులు తీసుకువచ్చే ధాన్యంపై అభ్యంతరాలు చెప్పటం మాని, ధాన్యం కొనుగోలు చేయాలని ప్రొక్యూర్మెంట్ సంస్థలకు, అధికారులకు జయపురం ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి విజ్ఞప్తి చేశారు. జయపురం సమితి జాముండ, కుములిపుట్లలో ఏర్పాటు చేసిన మండీలను సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. మండీలకు సంబంధిత అధికారులుఽ, ధాన్యం కొనుగోలుదారులు సకాలంలో రావాలని విజ్ఞప్తి చేశారు. రైతులను ఎవరు ఇబ్బంది పెట్టినా, కష్టం కలిగించినా క్షమించేది లేదని హెచ్చరించారు. జిల్లాలో మండీలు సక్రమంగా నిర్వహించటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. మండీలలో ధాన్య కొనేందుకు వస్తున్న కలహండీ జిల్లా మిల్లర్లు రైతులను ఇబ్బందులు పెడుతున్నారని, మండీలు తెరచినా మిల్లర్లు సకాలంలో రావటం లేదన్న ఆరోపణలు వచ్చాయన్నారు. కలహండీ మిల్లర్లు ఎక్కడ ధాన్యం కొన్నా నాణ్యత లేవని అభ్యంతరం తెలుపుతూ క్వింటాకు 8 నుంచి 10 కేజీల ధాన్యం అదనంగా తీసుకుంటున్నారని, తమకు తెలిసిందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎటువంటి కటింగ్లు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిందని, నేడు అందుకు భిన్నంగా జరుగుతుందన్నారు. గతంలో కన్నా ఎక్కవ ఆంక్షలు విధించటం తగదన్నారు. మిల్లర్లతో ఫోన్లో మాట్లాడి రైతులను ఇబ్బంది పెట్టవద్దన్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం మిల్లర్లు రైతుల నుంచి ధాన్యం కొనాలని ఆదేశించారు. ఆదేశాలను అమలు చేయకపోతే తగు చర్యలు తీసుకోవాలని తాము రాష్ట్ర ప్రభుత్వానికి కోరతానన్నారు. రైతులకు ఎటువంటి నష్టం కలిగినా సహించేది లేదన్నారు. జాముండ మండీలో మార్కెట్ యార్డును ప్రారంభించారు.

ధాన్యం కొనుగోలు చేయాలి

ధాన్యం కొనుగోలు చేయాలి