
వైఎస్ జగన్ను కలిసిన నాయకులు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం శ్రీకాకుళం జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, సాయిరాజ్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ పరిస్థితుల్ని వివరించారు. అదే విధంగా విధంగా, వైఎస్సార్సీపీ జిల్లా యువజన అధ్యక్షుడు మార్పు దుర్గాపృథ్వీరాజ్ కూడా జగన్మోహన్రెడ్డిని కలిశారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో ఇటీవల జరిగిన వెన్నుపోటు దినం కార్యక్రమం విజయవంతమైందని పృథ్వీరాజ్ తెలియజేశారు. – కవిటి/గార

వైఎస్ జగన్ను కలిసిన నాయకులు