
ఇద్దరు అరెస్ట్
జయపురం: యువకునిపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు జయపురం సదర్ పోలీసు అధికారి సచిన్ ప్రధాన్ మంగళవారం తెలిపారు. అరెస్టు అయిన వారు జయపురం సమితి గొడొపొదర్ పంచాయతీ కొలాగుడ గ్రామం నవీణ ఖోశ్ల (32), కిశోర్ కుమార్ కులదీప్(31) అని వెల్లడించారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచామని, వారికి బైలు మంజూరు కాక పోవటం వలన వారిని జైలుకు తరలించినట్లు తెలిపారు. ఈ నెల 7వ తేదీన బొడొపొదర్లో జరిగిన బిరిపాణి జాతరలో ఇద్దరు యువకులు అల్లర్లు చేసి హంగామా సృష్టించారు. వారికి గొడొపొదర్ పెంటియ సాహిలో ప్రదీప్ కుమార్ రాయ్(34) అడ్డు చెప్పాడు. తరువాత రాయ్ ఇంటికి వెళ్లి పోయాడు. మరునాడు ఉదయం ఆ ఇరువురు ప్రదీప్ రాయ్ ఇంటికి వెళ్లి చంపుతామని హెచ్చరించి, కత్తితో దాడి చేశారు. రాయ్ నడుముపై పెద్ద గాయమైంది. రాయ్ను కత్తితో పొడిచిన దుండగులు పరారీ అయ్యారు. రాయ్ కుటుంబ సభ్యులు జిల్లా కేంద్ర హాస్పిటల్లో చేర్చారు. బరిణిపుట్ పోలీసు సంటి అధికారి ఏఎస్ఐ సుశాంత్ దలపతి కేసు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

ఇద్దరు అరెస్ట్