
మీడియాపై దాడులు నశించాలి
టెక్కలి : ‘రాష్ట్రంలో మీడియాపై దాడులు నశించాలి.. సాక్షి కార్యాలయాలపై దాడులు అరికట్టాలి.. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని అక్రమ అరెస్టు ఖండించాలి..’ అంటూ టెక్కలిలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఏపీయూడబ్ల్యూజే కౌన్సిల్ సభ్యుడు బెండి నరసింగరావు ఆధ్వర్యంలో టెక్కలి అంబేడ్కర్ జంక్షన్లో ప్లకార్డులతో నిరసన చేపట్టారు. అ నంతరం రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహానికి నిరసన ప్రతులను అందజేశారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ...మీడియా సంస్థలు, జర్నలిస్టులు ప్రజల పక్షాన అక్షరమే ఆయుధంగా పోరాటాలు చేస్తుంటారని, ఈ క్రమంలో రాజకీయంగా వేధింపులు సరికాదని అన్నారు. ఎన్నో ప్ర యాసలతో జర్నలిస్టులు ప్రజల కోసం సామాజికంగా పనిచేస్తున్నారని, అటువంటి జర్నలిస్టులు, మీడి యా సంస్థలపై దాడులు చేయడం మంచిది కాదన్నారు.
టెక్కలిలో నిరసన చేస్తున్న మీడియా ప్రతినిధులు