షైనింగ్‌ స్టార్‌ పట్టం | - | Sakshi
Sakshi News home page

షైనింగ్‌ స్టార్‌ పట్టం

Jun 10 2025 3:44 AM | Updated on Jun 10 2025 3:44 AM

షైనిం

షైనింగ్‌ స్టార్‌ పట్టం

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సర్కారు విద్యార్థులకే పట్టం

గత వైఎస్సార్‌సీపీ హయాంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న ఆణి ముత్యాలు పేరిట ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న వారిని ప్రోత్సహించాలని టెన్త్‌క్లాస్‌, ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో టాప్‌ మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించి, జ్ఞాపికలు, నగదు ప్రోత్సాహకాలను అందజేశా రు. నాడు పాఠశాల/కళాశాల స్థాయి, మండలస్థాయి, నియోజకవర్గస్థాయి, జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి అంటూ ఐదుస్థాయిల్లో సత్కారాలు చేసి అవార్డులు, రివార్డులు అందజేశారు.

శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రంలో కార్పొరేట్‌ విద్య ను స్వయంగా ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. అక్క డ చదువుతూ టాప్‌ మార్కులు సాధించిన విద్యార్థులకు నజరానా అందజేసింది. ఇందుకు తాజాగా రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన షైనింగ్‌ స్టార్‌ అవార్డుల ఎంపికే ఉదాహరణ. తాజాగా ముగిసిన 2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో, ఇంటర్మీడియెట్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను షైనింగ్‌ స్టార్ల కింద ప్రభుత్వం ఎంపిక చేసింది. అంతవరకు బాగానే ఉన్నా.. అక్కడే తమ అస లు రంగు బయటపెట్టింది. ఎంపికచేసిన షైనింగ్‌ స్టార్ల జాబితాలో మెజారిటీ విద్యార్థులు కార్పొరేట్‌/ప్రైవేటు విద్యాసంస్థల వారే కావడం గమనార్హం.

పురస్కారాలు అందజేసిన కేంద్రమంత్రి,

ఇన్‌చార్జి మంత్రి

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని 80 అడుగుల రోడ్‌లో ఉన్న ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కె.రామ్మోహన్‌నాయుడుతో కలిసి విద్యార్థులకు రూ.20వేల చొప్పున పురస్కారాలను అందజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాశాఖపై ప్రత్యేకంగా దృష్టిసారించాయని కేంద్రమంత్రి అన్నారు. అంతకుముందు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ విద్యార్థులతో ముచ్చటించారు.

అనంతరం జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పిరియా విజయ అవార్డులకు ఎంపికై న విద్యార్థులను అభినందించారు. అంతకుముందు స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విద్యార్థులు అతిథులకు వెల్‌కమ్‌ చెప్పి.. ఆహ్వానించే కార్యక్రమం ఆకట్టుకుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు విద్యార్థులతో కలిసి పంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గొండు శంకర్‌, బగ్గు రమణమూర్తి, ఆర్డీఓ సాయిప్రత్యూష, ఇంటర్మీడియెట్‌ విద్య డీఐఈఓ ఆర్‌.సురేష్‌కుమార్‌, ఆర్‌ఐఓ పి.దుర్గారావు, డీఈఓ ఎస్‌.తిరుమల చైతన్య, విజయకుమారి, లియాకత్‌ ఆలీఖాన్‌, వివిద పాఠశాలలు, కళాశాలల ప్రతినిధులు, లెక్చరర్లు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

టెన్త్‌క్లాస్‌లో 178, ఇంటర్‌లో 35 మంది ఎంపిక

జిల్లా నుంచి షైనింగ్‌ స్టార్‌ అవార్డులకు పదో తరగతి విద్యార్ధులు మొత్తం 178 మంది ఎంపికయ్యారు. ఇందులో వివిధ ప్రభుత్వ యాజ మాన్య విద్యాసంస్థల విద్యార్థులు 93 మంది ఉండగా.. ప్రైవేటు విద్యార్థులే 85 మంది ఉండటం విశేషం. అలాగే ఇంటర్మీడియెట్‌ నుంచి షైనింగ్‌ స్టార్‌ అవార్డులకు మొత్తం 35 మంది ఎంపిక కాగా.. ఇందులో ప్రైవేటు కాలేజీ విద్యార్థులు ఏకంగా 23 మంది ఉండగా, ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు కేవలం 12 మంది మాత్రమే ఉన్నారు.

షైనింగ్‌ స్టార్‌ పేరుతో విద్యార్థులకు అవార్డుల అందజేత

మెజారిటీ విద్యార్థులు కార్పొరేట్‌/ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన వారే

కార్పొరేట్‌ను స్వయంగా ప్రోత్సహిస్తున్న కూటమి ప్రభుత్వం

కేంద్రమంత్రి, ఇన్‌చార్జి మంత్రి చేతులమీదుగా పురస్కారాల అందజేత

తప్పు పడుతున్న కూటమి నాయకులు..

జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన అవార్డుల పంపిణీకి వచ్చిన టీడీపీ నాయకులను సైతం విద్యార్థుల జాబితా ఆశ్చర్యానికి గురిచేసింది. స్థానికంగా ఓ సీనియర్‌ నేత బాహాటంగానే విమర్శలు గుప్పించారు.

తమ చినబాబు చేస్తున్న దుశ్చర్యల కారణంగా ప్రభుత్వ పరువు, ప్రతిష్ట రోజురోజుకీ దిగజారిపోతోందని పక్కన ఉన్న వ్యక్తులతో తన ఆవేదనను వ్యక్తం చేశారు. చినబాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంపై కూటమి పార్టీ నేతలు పెదవి విరుస్తున్నారు.

షైనింగ్‌ స్టార్‌ పట్టం 1
1/2

షైనింగ్‌ స్టార్‌ పట్టం

షైనింగ్‌ స్టార్‌ పట్టం 2
2/2

షైనింగ్‌ స్టార్‌ పట్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement