వినతుల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

వినతుల వెల్లువ

Jun 10 2025 3:44 AM | Updated on Jun 10 2025 3:44 AM

వినతు

వినతుల వెల్లువ

పర్లాకిమిడి:

ఆర్‌.ఉదయగిరి బ్లాక్‌ డబరగుడ పంచాయతీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌ సెల్‌కు జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, ఏడీఎం ఫల్గుణి మఝి, జిల్లా పరిషత్‌ ముఖ్య అభివృద్ధి అధికారి శంకర్‌ కెర్కెటా, తదితరులు హాజరయ్యారు. డబరగుడ, మహేంద్రగడ, చెలిగడ నుంచి 54 వినతులు అధికారులు స్వీకరించారు. వీటిలో 46 గ్రామ సమస్యలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని పరిష్కరించారు. దివ్యాంగునికి ట్రైసైకిల్‌ను అధికారులు అందజేశారు. ఆర్‌.ఉదయగిరి బీడీఓ లారీమన్‌ ఖర్సల్‌, తహసీల్దార్‌, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

బలిమెలలో..

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా బలిమెల ఎన్‌.ఎ.సి పురపాలక కార్యాలయంలో జిల్లా కలేక్టర్‌ ఆశీష్‌ ఈశ్వర్‌ పటేల్‌ సోమవారం గ్రీవెన్స్‌ నిర్వహించారు. బలిమెల ఎన్‌.ఎ.సి పరిధిలో ఉన్న పలు పంచాయతీల నుంచి 32 వినతులు స్వీకరించారు. సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. అభివృద్ధి పనులు ఏలా సాగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందజేశారు. జిల్లా అభివృద్ధి శాఖ అధికారి నరేశ్‌ కుమార్‌ సభరో, పోలీసు అధికారి, బలిమెల పురపాలక అధ్యక్షుడు ప్రదీప్‌ నాయక్‌, ప్రఽభుత్వ ఉద్యోగులు హాజరయ్యారు.

వినతుల వెల్లువ 1
1/2

వినతుల వెల్లువ

వినతుల వెల్లువ 2
2/2

వినతుల వెల్లువ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement