
అభివృద్ధిని ప్రజలకు వివరిస్తాం
రాయగడ: బీజేపీ అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పలు శాఖల అధికారులలో జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వారి సమీక్షించారు. సోమవారం డీఆర్డీఏ సమావేశం హాల్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో జిల్లా పరిషత్ కార్యనిర్వాహక అధికారి అక్షయ్ కుమార్ ఖెముండొ, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నహాలు చేపట్టాలని కలక్టర్ సూచించారు. ఈ నెల 11 నుంచి జిల్లాలో గల 11 సమితుల్లో తిరిగేలా వికాస్ వాహనాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ వాహనం అన్ని ప్రాంతాల్లో తిరిగి ఏడాదిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుందన్నారు. ఆయా సమితుల్లో గల బీడీఏలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ వాహనాన్ని స్వాగతించి, ఆయా సమితి పరిధుల్లో తిరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వాహనం తిరిగే సమయంలో కొత్తగా రేషన్ కార్డుల పంపిణీ, ఆధార్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేయడంతోపాటు కళాకారులకు పింఛన్లు, అటవీ భూమి పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేయాలన్నారు.
రేపటి నుంచి సమితుల్లోకి వికాస్
వాహనం