బ్రాహ్మణ సమాజం నూతన కార్యవర్గం | - | Sakshi
Sakshi News home page

బ్రాహ్మణ సమాజం నూతన కార్యవర్గం

Jun 3 2025 5:45 AM | Updated on Jun 3 2025 5:45 AM

బ్రాహ

బ్రాహ్మణ సమాజం నూతన కార్యవర్గం

రాయగడ: మునిగుడలోని బ్రాహ్మణ సమాజం నూతన కార్యవర్గం ఏర్పాటైంది. అధ్యక్షులుగా విద్యాధర్‌ దాస్‌, కార్యదర్శిగా సింహాచల్‌ పండా, ఉపాధ్యక్షులుగా రామప్రసాద్‌ రథో, సహకార్యదర్శిగా లక్ష్మీ పాణిగ్రహి, కోశాధికారిగా రామక్రిష్ణ పాణిగ్రహిలు నియమితులవ్వగా ప్రభాత్‌ పాణిగ్రహి, సింమాచల్‌ దాస్‌, క్షమా సాగర్‌ దాస్‌, నారాయణ పండా, దమోదర్‌ మహాపాత్రో, ఆమీర్‌ కుమార్‌ మిశ్రో, తరణీ చరణ్‌ పండా, సౌమ్యరంజన్‌ సాహు, రవీంద్ర కుమార్‌ త్రిపాఠిలు కోర్‌ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. ఆదివారం సాయంత్రం ఈ మేరకు మునిగుడలోని బ్రాహ్మణ సమాజం సమావేశం హాల్‌లో జరిగిన సర్వసభ్య సమావేశంలో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. సమాజంలోని సమస్యల పరిష్కారానికి అంతా కలసి కట్టుగా కృషి చేయాలని నిర్ణయించారు.

రోడ్డు పనులు పూర్తి చేయాలి

జయపురం: జయపురం సమితి కుములిపుట్‌ రోడ్డు మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని ఆ గ్రామ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. వెంటనే రోడ్డు పనులు పూర్తి చేయక పోతే ఆందోళన చేపడతామని ఆ గ్రామ పెద్దలు ప్రతాప్‌ గౌఢ, సుదీప్‌ పొద్దార్‌, హరిశ్చంఽధ్ర ముదులి, ప్రశాంత ఖొర, సూర్యనారాయణ భొత్ర, సూర్య భొత్ర, పంకజ బోష్‌,తులారాం నాయిక్‌ మొదలగు వారు అధికారులను హెచ్చరించారు. కుమిలిపుట్‌ మీదుగా 26 వ జాతీయ రహదారి ఉందని, ఆ జాతీయ రహదారి గతుకుల మయంగా ఉందని, అంతే కాకుండా జాతీయ రహదారి నుంచి డొంగరుకు రహదారి ఉందని ఆ మార్గం గోతులతో నిండి ఉందని వారు వెల్లడించారు. డొంగర రహదారిపై 6 గ్రామాల ప్రజలు ఆధార పడుతున్నారని, అంతే కాకుండా వారసంత, ధాన్యం మండీ, మొదలగు కార్యాలయాలు డొంగర రహదారిలోనే ఉన్నాయని తెలిపారు. అలాగనే ఈ మార్గం ఇరువైపులా కొంత మంది ఆక్రమించి కట్టడాలు నిర్మించారని ఆరోపించారు. అందువలన రోడ్డుపై పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయని తెలిపారు. ఈ దారిలో అంబులెన్స్‌లు రావడం లేదని, వెంటనే రోడ్డు బాగు చేయాలని కోరారు.

జగన్నాథ్‌ సాగర్‌ పునరుద్ధరణపై సమీక్ష

జయపురం: జయపురం చారిత్రాత్మక జగన్నాథ సాగర్‌ పునరుద్ధరణ పనులను జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్‌ బాహిణీపతి సోమవారం సమీక్షించారు. సాగర్‌ పునరుద్ధరణ పనులు జరుగుతుండగా బాహిణీపతి నేటి ఉదయం జగన్నాథ్‌ సాగర్‌ వద్దకు వెళ్లి జరుగుతున్న పనులు ఎలా జరుగుతున్నదీ పరిశీలించారు. సాగర్‌లో ఉన్న మట్టి, పూడిక పనులపై అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్‌ ప్రతినిధికి తెలిపారు. పనులు వేగంగా జరుపుతున్న సమయంలో వానలు పడడంతో ఆటంకం కలిగిందని అన్నారు. సాగర్‌ పనులు చేస్తున్న పనివాళ్లకు రక్షణ కరువైందని, తమ కంపెనీ డ్రైవర్‌ పడుకున్న సమయంలో అతడి సెల్‌ఫోను, డబ్బు ఎవరో దొంగిలించారని ఎమ్మెల్యేకు తెలిపారు. విషయం తెలిసిన ఎమ్మెల్యే స్పందించారు. వెంటనే ఆయన పట్టణ పోలీసు అధికారికి ఫోను చేసి వెంటనే సాగర్‌ ప్రాంతంలో పెట్రోలింగ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయనతో పాటు సాగర్‌ సందర్శించిన వారిలో మున్సిపాలిటీ చైర్మన్‌ నరేంద్ర కుమార్‌ మహంతి, మున్సిపాలిటీ అదనపు కార్యనిర్వాహక అధికారి పూజ రవుత్‌, ఇంజినీర్‌ అజయ కుమార్‌ జాని, జూనియర్‌ ఇంజనీర్‌ ప్రతాప్‌ ఆచార్య తదితరులు పాల్గొన్నారు.

బ్రాహ్మణ సమాజం నూతన కార్యవర్గం 1
1/2

బ్రాహ్మణ సమాజం నూతన కార్యవర్గం

బ్రాహ్మణ సమాజం నూతన కార్యవర్గం 2
2/2

బ్రాహ్మణ సమాజం నూతన కార్యవర్గం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement