
ఆవుల అక్రమ తరలింపునకు చెక్
జయపురం: ఆవుల అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ సమితి బి.సింగపూర్ వద్ద మంగళవారం సాయంత్రం కొంతమంది అక్రమంగా గోవులను తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి 75 ఆవులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసిటన్టు బుధవారం తెలిపారు. జయపురం సమితి జయంతిగిరి సంత నుంచి ఆవులను నడిపించుకుంటూ బొరిగుమ్మ రాణిగుడ మార్గం గుండా కొరాపుట్ వైపు తీసుకెళ్తుండగా బిసింగపూర్ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అరెస్టు అయిన వారిలో సెమిలిగుడ వ్యాపారి ఒకరు ఉన్నట్టు వెల్లడించారు. ఆవులను జయంతిగిరి వారపు సంత నుంచి బొరిగుమ్మ, రాణిగుడ మీదుగా కుందులి సంతకు వెళ్లి అచ్చట నుంచి ఆవులను ఆంధ్రప్రదేశ్కు తరలించేందుకు తీసుకెళ్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. జిల్లాలో గోవుల రవాణాపై అధికారులు ఆంక్షలు విధించినప్పటికీ అనేక మార్గాలలో వ్యాపారులు గోవులను తరలిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. కొరాపుట్ జిల్లాలో గోవులను సేకరించి వాటిని పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారన్నారు. గత మే నెలలో పలుసార్లు గోవుల రవాణా చేస్తూ అనేక మంది పోలీసులకు చిక్కిన విషయం విదితమే. గత మే 27వ తేదీన పశువులు రవాణా చేసే కంటైనర్లను పట్టుకొని 210 పశువులను పట్టుకున్న సంఘటనలో 17 మందిని అరెస్టు చేశారు. ఈ సంఘటన మరువక ముదే మంగళవారం సాయంత్రం 76 ఆవులతో ముగ్గురు పట్టు బడ్డారు.
76 ఆవులు స్వాధీనం
ముగుర్గు అరెస్టు