
కలెక్టరేట్ గ్రీవెన్స్కు 81 వినతులు
పర్లాకిమిడి: స్థానిక గజపతి జిల్లా కలెక్టరేట్లో సోమవారం జిల్లా యంత్రాంగం గ్రీవెన్సు సెల్ను ప్రారంభించింది. జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్, జిల్లా ఎస్పీ జ్యోతీంద్రనాథ్ పండా, డీఎఫ్వో కె.నాగరాజు, జిల్లా పరిషత్ ముఖ్యకార్వనిర్వాహణాధికారి శంకర కెరకెటా తదితరులు హాజరయ్యారు. గ్రీవెన్స్కు మొత్తం 81 వినతులు అధికారులకు అందగా వాటిలో రెండు వినతులను అధికారులు అక్కడికక్కడే పరిష్కరించారు. మిగతా వాటిలో 75 వ్యక్తిగతం కాగా, ఆరు గ్రామసమస్యలకు సంబంధించినవి. తులసిపాడు గ్రామానికి చెందిన దివ్యాంగునికి ఉపాధి అవకాశం కల్పించాలని, త్రీవీలర్ బండి ప్రభుత్వం అందజేయాలని ఆయన కలెక్టర్ను కోరాడు. మరికొంతమంది వృధ్ధాప్య పింఛన్లు, రేషన్ కార్డులకు సంబంధించి వినతులు అందజేశారు. పర్లాకిమిడి, సిద్ధమణుగు, రాణిపేట, కత్తలకవిటి గ్రామలకు చెందిన వారు వినతులను అందించారు.

కలెక్టరేట్ గ్రీవెన్స్కు 81 వినతులు

కలెక్టరేట్ గ్రీవెన్స్కు 81 వినతులు