బంగారం దుకాణం యజమానిపై దాడి | - | Sakshi
Sakshi News home page

బంగారం దుకాణం యజమానిపై దాడి

Jun 5 2025 8:06 AM | Updated on Jun 5 2025 8:06 AM

బంగార

బంగారం దుకాణం యజమానిపై దాడి

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో మెయిన్‌ రోడ్డులో ఉన్న ప్రసాద్‌ బంగారం దుకాణం యజమానిపై దాడి జరిగింది. దుకాణాన్ని ముసేవేసి బంగారంతో ఉన్న బ్యాగ్‌తో ఇంటికి వెళ్తున్న యజమాని ప్రసాద్‌ పేల్‌పై ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండుగులు దాడి చేశారు. అతని చేతిలో ఉన్న బ్యాగ్‌ను దుండగులు లాక్కొని పరారయ్యారు. దీంతో బాధితుడు వెంటనే మల్కన్‌గిరి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాధు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్‌డీపీవో దివ్యడలై, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గతంలో కూడా ప్రసాద్‌ ఇంట్లో బంగారం చోరీకి గురైంది.

యాదవుల కలశ యాత్ర

రాయగడ: జమ్మూకశ్మీర్‌ నుంచి బయలు దేరి రాయగడకు చేరుకున్న కలశయాత్రకు ఉత్కళ యాదవ సంఘం రాయగడ శాఖ సభ్యులు బుధవారం ఘనంగా స్వాగతం పలికారు. జమ్మూకశ్మీర్‌లో అఖిల భారతీయ యాదవ సంఘం చేపట్టిన ఈ కలశ యాత్ర ఊరేగింపులో భాగంగా ఇక్కడకు చేరుకొని ప్రధాన వీధుల మీదుగా రాయగడ కళాశాల సమీపంలోని రాధా కృష్ణ మందిరం వరకు కొనసాగింది. కార్యక్రమంలో గోపాల్‌ సంఘం యువ విభాగం అధ్యక్షుడు అమర్‌ గోపాల్‌, జిల్లా కార్యదర్శి ప్రతాప్‌ చంద్ర గౌడో, కోఆర్డినేటర్‌ గోపినాథ్‌ గౌడో పాల్గొన్నారు.

మాదకద్రవ్యాలతో అనర్థం

రాయగడ: మాదక ద్రవ్యాల వినియోగంతో యువత బంగారు భవిష్యత్‌ అంధకారమవుతుందని కలెక్టర్‌ ఫరూల్‌ పట్వారి అన్నారు. కలెక్టర్‌ కార్యాలయం ప్రాంగణంలో బుధవా రం జిల్లా అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పది రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలను చైతన్యపరచనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అబ్కారీ శాఖ అధికారి సంతోష్‌కుమార్‌ ధల్‌, ఆర్‌టీఓ రాజ్‌కిషొర్‌ బెహరా, జిల్లా విద్యాశాఖ అధికారి రామ నాహ క్‌, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంత కుమార్‌ ప్రధాన్‌ తదితరులు పాల్గొన్నారు.

అక్రమ భవన నిర్మాణం అడ్డగింత

కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలోని కేటీ రోడ్‌లో పలాస ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎదురుగా నిర్మితమవుతున్న అక్రమ భవన నిర్మాణాన్ని మున్సిపల్‌ అధికారులు అడ్డుకున్నారు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ బేఖాతరు చేసి సదరు బిల్డింగ్‌ యజమాని నిర్మాణ పనులను కొనసాగిస్తుండగా, కమిషనర్‌ నడిపిన రామారావు ఆదేశానుసారం పురపాలక సంఘం టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది సదరు నిర్మాణ పనులను బుధవారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ఈ పురపాలక సంఘంలో ఎవరైనా అక్రమ నిర్మాణాలను చేస్తే సదరు బిల్డింగ్‌ యజమానులపై కేసులు వేసి కోర్టులో హాజరు పరుస్తామన్నారు. అక్రమ భవన నిర్మాణాలను తక్షణమే నిలిపివేసి, నిబంధనల మేరకు నడుచుకోవాలని హెచ్చరించారు.

గుండెపోటుతో

కళాకారుడు మృతి

కంచిలి: గ్రామదేవత ఉత్సవాల్లో స్టేజీ ప్రోగ్రా మ్‌ ఇచ్చేందుకు వచ్చిన ఒక కళాకారుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన బుధవారం కంచిలిలో చోటు చేసుకొంది. వివరాల్లోకి వెళ్తే.. బుధవా రం రాత్రి కంచిలి ఉత్సవాల్లో భాగంగా సినీ డూప్స్‌ స్టేజీ ప్రోగ్రాం ఇచ్చేందుకు కళాకారుల బృందం ఉదయమే వచ్చారు. వీరు మంగళవారం రాత్రి వజ్రపుకొత్తూరు మండలం కొమరల్తాడలో ప్రదర్శన ఇచ్చి, అటునుంచి ఇక్కడికి వచ్చారు. ఉదయం కాలకృత్యాలు తీర్చుకోడానికి స్థానిక మఠం చెరువు వద్దకు వెళ్లారు. వీరిలో బాలకృష్ణ డూప్‌గా నటిస్తున్న సప్ప కల్యాణ్‌(65) చెరువు గట్టు మీద ఒక చెట్టుకింద కూర్చొని గుండెనొప్పి రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. ఇతనిది విశాఖపట్నం జిల్లా గాజువాక పెద్దగంట్యాడ ప్రాంతం. తోటి కళాకారుడు మృతి చెందడంతో ఉత్సవ కమిటీ సభ్యులు ఈ ప్రదర్శనను రద్దు చేశారు.

బంగారం దుకాణం  యజమానిపై దాడి 1
1/3

బంగారం దుకాణం యజమానిపై దాడి

బంగారం దుకాణం  యజమానిపై దాడి 2
2/3

బంగారం దుకాణం యజమానిపై దాడి

బంగారం దుకాణం  యజమానిపై దాడి 3
3/3

బంగారం దుకాణం యజమానిపై దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement