అకడమిక్‌ అంశాలపై దృష్టి సారించండి | - | Sakshi
Sakshi News home page

అకడమిక్‌ అంశాలపై దృష్టి సారించండి

Jun 6 2025 12:51 AM | Updated on Jun 6 2025 12:51 AM

అకడమిక్‌ అంశాలపై దృష్టి సారించండి

అకడమిక్‌ అంశాలపై దృష్టి సారించండి

శ్రీకాకుళం న్యూకాలనీ: విద్యాప్రమాణాలను పెంపొందించేందుకు హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు విద్యాసంబంధిత అంశాలతోపాటు అకడమిక్‌ అంశాలపై దృష్టి సారించాలని డీఈఓ డాక్టర్‌ ఎస్‌.తిరుమల చైతన్య అన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అకడమిక్‌ అంశాలపై జరుగుతున్న జిల్లాస్థాయి డీఆర్పీల మూడు రోజుల శిక్షణా తరగతులు గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ హెచ్‌ఎంలు, సబ్జెక్టు ఉపాధ్యాయులు అకడమిక్‌ అంశాలైన క్యాలెండర్‌, హ్యాండ్‌బుక్‌, అసెస్మెంట్‌, కరికులం వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. రాష్ట్ర పరిశీలకులు గిరిజా శంకర్‌ మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు మూడవ విడత ట్రైనింగ్‌లో ప్రతి హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు అకడమిక్‌ అంశాలపై శిక్షణ పొందాలన్నారు. ఈ నెల 9, 10, 11 తేదీలలో జిల్లాలో శ్రీకాకుళం, టెక్కలి, పలాస మూడు డివిజన్‌ల పరిధిలో ఉపాధ్యాయులకు తాజాగా శిక్షణ పొందిన డీఆర్పీలతో శిక్షణా తరగతులు ఉంటాయ ని పేర్కొన్నారు. హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులంతా హాజరుకావాల్సిందేనని స్పష్టంచేశారు. కార్యక్రమంలో కోర్స్‌ డైరెక్టర్‌, ఉప విద్యాశాఖ అధికారులు ఆర్‌. విజయకుమారి, పి.విలియం, డీసీఈబీ సెక్రటరీ జి.రాజేంద్రప్రసాద్‌, వమ్మరవల్లి డైట్‌ ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ ఎ.గౌరీశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement