
నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
రాయగడ: స్థానిక బాలాజీ నగర్లోని కల్యాణ వేంకటేశ్వర ఆలయంలో శుక్రవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవ్వనున్నాయి. ఉత్సవాలు ఈనెల 11వ తేదీ వరకు కొనసాగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు తెలియజేశారు. ప్రతిరోజూ ఉదయం 5.30 గంటలకు సుప్రభాత సేవ, శాత్తుమురై, వేద పారాయణం, నిత్య శేష హోమాలు, ఉదయం 9 గంటలకు సత్యనారాయణ స్వామివారి వ్రతములు, సాయంత్రం 6 గంటలకు విశ్వక్సేన ఆరాధన, రక్షాసూత్రధారణ, మత్య్సంగ్రహణం, వాస్తు యోగిశ్వర పూజలు, ప్రసాద వితరణ జరుగుతాయి. అదేవిధంగా 7వ తేదీన స్వామివారి వ్రతములు, గరుడ ధ్వజారోహణం, సాయంత్రం 5 గంటలకు ఎదర్కొలోత్సవం, 5.30 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం, 8 గంటలకు శేష వాహనోత్సవం తదితర కార్యక్రమాలు జరుగుతాయి.