పాఠశాలల్లో కోవిడ్‌ నియమావళి అమలు | - | Sakshi
Sakshi News home page

పాఠశాలల్లో కోవిడ్‌ నియమావళి అమలు

Jun 6 2025 12:51 AM | Updated on Jun 6 2025 12:51 AM

పాఠశా

పాఠశాలల్లో కోవిడ్‌ నియమావళి అమలు

భువనేశ్వర్‌: రాష్ట్రంలో కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసుల నమోదు క్రమంగా పెరుగుతోంది. మరోవైపు వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు తెరిచే సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పాఠశాలలు, సామూహిక విద్యా విభాగం అప్రమత్తం అయింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది కోవిడ్‌ సంక్రమణ బారిన పడకుండా నివారణ చర్యల కింద కోవిడ్‌ – 19 ఆరోగ్య నియమావళిని అమలు చేయనున్నట్లు మంత్రి నిత్యానంద గోండ్‌ గురువారం ప్రకటించారు. వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు తిరిగి తెరవడంతో కోవిడ్‌ నియమావళి అమలుకు సంబంధించి ఉత్తర్వులు జారీ కానున్నాయి. పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది కోవిడ్‌ – 19 భద్రతా చర్యలను పాటించాల్సి ఉంటుంది. జలుబు వంటి లక్షణాలు ఉన్న విద్యార్థులు మాస్కులు ధరించి పాఠశాలకు హాజరు కావలసి ఉంటుందన్నారు. తీవ్రమైన అనారోగ్య లక్షణాలు ఉన్నవారు ఇంట్లోనే ఉండి హోం క్వారంటైన్‌ పాటించాలని మంత్రి సలహా ఇచ్చారు.

మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ

భువనేశ్వర్‌: మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని గవర్నర్‌ డాక్టర్‌ హరిబాబు కంభంపాటి అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని స్థానిక రాజ్‌ భవన్‌ ప్రాంగణంలో గవర్నర్‌ దంపతులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో రాజ్‌ భవన్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఐఆర్‌ఎస్‌కు సాయిరాం ఎంపిక

రణస్థలం: సివిల్‌ సర్వీస్‌– 2025 ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన రణస్థలం మండలం వెల్పురాయి గ్రామానికి చెందిన సేనా పతి సాయిరాం ఇండియ న్‌ రెవెన్యూ సర్వీస్‌కు ఎంపికయ్యారు. ఇతని తండ్రి సూర్యనారాయణ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సాయిరాం ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

షేక్‌ రుక్సాద్‌కు ప్రతిభా అవార్డు

ఇచ్ఛాపురం రూరల్‌: ఇంటర్మీడియట్‌ బైపీ సీ విభాగంలో ఉత్తమ మార్కులు సాధించిన షేక్‌ రుక్సాద్‌కు ప్రభు త్వం ప్రతిభా అవార్డు ను గురువారం అందజేసింది. ఈ మేరకు ఎం.తోటూరు ఆది త్యా కళాశాల సిబ్బంది విద్యార్థిని అభినందించారు. విద్యార్థి వెయ్యి మార్కులకు 982 మార్కులు సాధించారు. షేక్‌ రుక్సాద్‌ తండ్రి ఇచ్ఛాపురం పట్టణంలో టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

రెండు తులాల బంగారం చోరీ

కొత్తూరు: బలద గ్రామానికి చెందిన కంచరాం పురుషోత్తం ఇంట్లో బుధవారం రాత్రి దొంగలు పడ్డారు. వివాహం నిమిత్తం బంధువుల ఇంటి కి వెళ్లి గురువారం ఉదయం వచ్చేసరికి తలుపు లు తెరిచి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. బీరువా తాళాలు విరగ్గొట్టి అందులో ఉన్న రెండు తులాల బంగారు వస్తువులను పట్టుకుపోయారు. అనంతరం బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ప్రసాదరావు, క్లూస్‌టీమ్‌ గురువారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఏఎస్‌ఐ కేసు నమోదు చేశారు.

పిడుగు పాటుకు ఆవు మృతి

నందిగాం: బడగాం పంచాయతీ కాశీరాజుకాశీపురంలో గురువారం పిడుగు పడి సనపల ముఖలింగంకు చెందిన ఆవు మృతి చెందింది. గ్రామ సమీప పొలాల్లో ఆవును మేతకు తీసుకువెళ్ల ఒక్కసారిగా పిడుగు పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. వెటర్నరీ అసిస్టెంట్‌ సునీత ఘటనా స్థలాన్ని పరిశీలించి పశుసంవర్ధక శాఖ ఏడీ రవికృష్ణకు విషయం తెలియజేశారు.

పేకాటరాయుళ్లపై కేసు నమోదు

ఎచ్చెర్ల: లావేరు మండలం బుడుమూరులో పేకాట శిబిరంపై లావేరు పోలీసులు గురువారం దాడి చేశారు. ఐదుగురు పేకాటరాయుళ్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు, రూ.9,100 నగదు స్వాధీనం చేసుకున్నారు. హెచ్‌సీ హెచ్‌.జోగారావు కేసు నమోదుచేశారు.

పాఠశాలల్లో కోవిడ్‌ నియమావళి అమలు 1
1/3

పాఠశాలల్లో కోవిడ్‌ నియమావళి అమలు

పాఠశాలల్లో కోవిడ్‌ నియమావళి అమలు 2
2/3

పాఠశాలల్లో కోవిడ్‌ నియమావళి అమలు

పాఠశాలల్లో కోవిడ్‌ నియమావళి అమలు 3
3/3

పాఠశాలల్లో కోవిడ్‌ నియమావళి అమలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement