పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

Jun 6 2025 12:51 AM | Updated on Jun 6 2025 12:51 AM

పర్యా

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

మల్కన్‌గిరి:

ల్కన్‌గిరి సమితి తండకి పంచాయతీ బండిగూడలో గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని అటవీ, ఎకై ్సజ్‌, జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా లీగల్‌ అథారిటీ కార్యదర్శి న్యాయమూర్తి సంగీతా పాత్రో ఈ కర్యక్రమాన్ని ప్రారంభించారు. మొక్కల పెంపకంతో వచ్చే లాభాలు గూర్చి వివరించారు. జిల్లా అటవీశాఖ అధికారి ప్రతాప్‌ కోత్తపల్లి, మల్కన్‌గిరి ఎకై ్సజ్‌ అధికారి బింబధర్‌ పండా, మల్కన్‌గిరి అదనపు ఎకై ్సజ్‌ అధికారి టంకధర్‌ బోయి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

జయపురంలో..

జయపురం: పర్యావరణ పరిరక్షణే సమస్త జీవుల మనుగడకు శ్రీరామ రక్ష అన్నారు పలువురు ప్రముఖులు అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జయపురంలో పలు సంస్థలు కార్యక్రమాలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. స్థానిక ఎం.ఎస్‌.స్వామినాథన్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌ కేంద్రం సభాగృహంలో ఒడిశా అటవీ పర్యావరణం, జల వాయు పరివర్తన విభాగం, సహకారంతో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి 50 మంది రైతులు పాల్గొన్నారు. స్వామినాథన్‌ పరిశోధన కేంద్రంలో వివిధ రకాల మొక్కలను నాటారు. జిల్లా జడ్జి, ప్రదీప్‌ కుమార మహంతి, జయపురం అటవీ విభాగ అధికారి ప్రతాప్‌ బెహర, జయపురం సబ్‌కలెక్టర్‌ అక్కవరం శొశ్యా రెడ్డి, సివిల్‌ జడ్జి శ్రీమతి అలకానంద మహంతి, తదితరులు పాల్గొన్నారు.

ఉన్నత పాఠశాలలో..

జయపురం ప్రధాన మంత్రి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం పాటించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రకాశ చంద్ర పట్నాయక్‌ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఎఫ్‌ఓ ప్రతాప్‌ కుమార్‌ బెహరా, అటవీ రేంజర్‌ సచ్చిదానంద పొరిడ పాల్గొని మొక్కలు నాటారు. పాఠశాల సీనియర్‌ ఉపాధ్యాయులు విశ్వరంజన్‌ గౌడ, ప్రభాకర మహరాణ, అరుంధతి త్రిపాఠి, రశ్మితా నాహక్‌, సంతోషిణి పండా, రజణీ కాంత ఘొడాయి పాల్గొని మొక్కలు నాటారు.

రాయగడలో..

రాయగడ: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు జరిగాయి. మున్సిపాలిటీ యంత్రాంగం ఆధ్వర్యంలో పాలిథిన్‌ వినియోగానికి స్వస్థి పలకాలని గురువారం ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్‌ చైర్మన్‌ మహేష్‌ పట్నాయక్‌, కార్యనిర్వాహక అధికారి కులదీప్‌ కుమార్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు. జిసిడి వాకర్స్‌ క్లబ్‌, జేకే పేపర్‌ మిల్‌ ఉద్యోగులు మొక్కలు నాటారు. అటవీ శాఖ కార్యాలయంలో మొక్కలు నాటారు.

పర్లాకిమిడిలో..

పర్లాకిమిడి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక గుండిచా మందిరం నుంచి ఒక ర్యాలీని జిల్లా కలెక్టర్‌ బిజయ కుమార్‌ దాస్‌ ప్రారంభించారు. ఈ ర్యాలీలో జిల్లా ఎస్పీ జ్యోతింద్రనాథ్‌ పండా, అబ్కారీశాఖ సూపరింటెండెంట్‌ ప్రదీప్‌ కుమార్‌ సాహు, డీఈఓ డాక్టర్‌ మయాధర్‌ సాహు, పురపాలక ఈఓ లక్ష్మణముర్ము, పోలీసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గోన్నారు. ర్యాలీ అనంతరం మహేంద్రతనయ వద్ద ఉన్న బృందావన ప్యాలస్‌లో ప్లాస్టిక్‌ వ్యర్థాలను శుభ్రం చేశారు. జిల్లా అటవీ శాఖ అధికారి కె.నాగరాజు ఆధ్యక్షతన బృందవన ప్యాలస్‌లో జరిగిన సాధారణ సమావేశంలో కలెక్టర్‌ దాస్‌, మ్మెల్యే రూపేష్‌ పాణిగ్రాహి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ గవర తిరుపతిరావు తదితరులు పాల్గొని మొక్కలను నాటారు. డి.ఎఫ్‌.ఓ. కె.నాగరాజు మాట్లాడుతూ ఈ ఏడాది 740 హెక్టార్లలో 3 లక్షల నర్సరీ పాప్లింగ్స్‌, మరో 5 లక్షల మొక్కలను పంపిణీ చేస్తున్నామన్నారు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత 1
1/5

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత 2
2/5

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత 3
3/5

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత 4
4/5

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత 5
5/5

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement