
నాలుగు కేజీల గంజాయితో వ్యక్తి అరెస్టు
ఇచ్ఛాపురం టౌన్ : ఒడిశా నుంచి పూణేకు 4.18 కిలోల గంజాయి తరలిస్తున్న ఎలియా రైత అనే వ్యక్తిని గురువారం అరెస్టు చేసినట్టు సీఐ ఎం చిన్నంనాయుడు తెలిపారు. ఒడిశా రాష్ట్రం లుహకంటి గ్రామానికి చెందిన ఎలియా రైతా తన సోదరుడు జోహర్ రైతాతో కలిసి కుంజన ప్రాంతంలో గంజాయిని కొనుగోలు చేసి మహరాష్ట్రకు చెందిన రాఖేష్ సుదంప్లంజ్(చాచా)కు అమ్ముతుండేవారు. ఈ క్రమంలో ఎలియా రైతా రెండు ప్యాకెట్ల గంజాయితో బరంపురం నుంచి ఇచ్ఛాపురం వచ్చాడు. రైల్వేస్టేషన్ వద్ద పోలీసులు తనిఖీ చేయగా గంజాయి గుర్తించడంతో అరెస్ట్ చేసినట్టు సీఐ తెలిపారు.