
ప్రాణాలు తోడేస్తూ!
ఇసుక తవ్వేస్తూ..
శ్రీకాకుళం రూరల్: ఇసుక అక్రమార్కులు నిబంధనలకు తూట్లుపొడుస్తున్నారు. నదిలో ఇష్టారాజ్యంగా యంత్రాలతోనే భారీ ఎత్తున తవ్వకాలు చేస్తున్నా రు. ఫలితంగా పెద్ద పెద్ద గోతులు ఏర్పడుతున్నా యి. ఇటీవల కురిసిన వర్షాలతో పాటు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న నీరు ఆ గోతుల్లో చేరుతోంది. వాటిని గమనించని సామాన్యులు ప్రమాదవశా త్తు దిగి కూరుకుపోయి మృత్యువాతపడుతున్నారు. ఇలాంటి ఘటనే ఇటీవల శ్రీకాకుళం రూరల్ మండ ల పరిధిలో చోటు చేసుకుంది.
ఆదేశాలు బేఖాతరు..
వంశధార నదీ పరివాహక ప్రాంతాల్లో అనుమతులకు మించి తవ్వకాలు చేస్తున్నా అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. జిల్లా కలెక్టర్ సైతం ఆక్రమ తవ్వకాలపై కన్నెర్ర చేసినా రెవెన్యూ, మైన్స్ అధికారులు తమకేమీ పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. బైరి, కరజాడ పరిసర ప్రాంతా ల్లో పగలు రాత్రీ అనే తేడా లేకుండా ఇసుక దందా సాగుతోంది. నదిలో ఎక్కడికక్కడే భారీగా గోతులు తవ్వేస్తూ వదిలేస్తున్నారు. ఇప్పటికే ఇసుక తవ్వకా లు నిత్యం చేపట్టడంతో వ్యవసాయ బోరులు సైతం పాడైపోయాయని పరిసర ప్రాంత రైతులు ఆవేదన చెందుతున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కడికక్కడే తవ్వకాలు చేయడంతో గత నెలలో బైరి గ్రామానికి చెందిన గొర్లె రామారావు అనే వ్యక్తి వంశధార నదిలోకి స్నానానికి వెళ్లినప్పుడు భారీగా ఏర్పడిన గోతులో కూరుకుపోయి ప్రాణాలు పోగుట్టుకున్నాడు. ఇలాంటి గోతులే నదిలో ఎక్కడికక్కడ ఉన్నాయి. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, మైన్స్ అధికారులు మాత్రం అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. అనుమతులకు మించి తవ్వకాలు చేయడం, ఎక్కడికక్కడే గోతులు ఏర్పడటం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయ ని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రానైట్ పలకలతో ఇసుక ర్యాంప్..
బైరి ర్యాంప్ను ఆనుకొని ఏకంగా నదీ గర్భంలోకే గ్రానైట్ పలకలతో కూడిన ర్యాంప్ను రోడ్డు మాదిరిగా వేసేశారు. దీని మీదుగా పెద్దపెద్ద వాహనాలు వెళ్తూ ఇసుక లోడింగ్ చేస్తున్నారు. నిబంధనల ప్రకారంలో కూలీలతో ట్రాక్టర్లకు ఇసుక నింపాల్సి ఉండ గా 200 హైస్పీడ్తో కూడిన ప్రొక్లెయినర్లతో ఇక్కడ వినియోగిస్తున్నారు. ఫలితంగా నదీగర్భంలో ఎక్కడికక్కడే పెద్దపెద్ద గోతులు ఏర్పడి సామాన్యుల ప్రాణాలకు మీదకు వస్తోంది.
వంశధార నదిలో
ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు
ఎక్కడికక్కడే భారీగా గోతులు
ప్రమాదవశాత్తు మృత్యువాతపడుతున్న సామాన్యులు
పట్టించుకోని అధికారులు
తవ్వకాలు వాస్తవమే..
బైరి ప్రాంతంలో ఇసుక తవ్వకాలు నిత్యం జరుగుతున్నాయి. ఈ ర్యాంపును శ్రీ వెంకటేశ్వర మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు నిర్వహిస్తున్నారు. నదిలోకి నేరుగా గ్రానైట్ పలకలతో కూడిన ర్యాంప్ వేశారు. ఇచ్చిన అనుమతులు కన్నా ఎక్కువగానే తవ్వేస్తున్నారు.
– శ్రీనివాసరావు, బైరి వీఆర్ఓ
అనుమతులకు మించి తవ్వకాలు
బైరి గ్రామంలో అనుమతులకు మించి అక్రమంగా తవ్వకాలు చేయడంతో ఇటీవల మా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి స్నానానికి దిగి చనిపోయాడు. అయినా తవ్వకాలు మాత్రం ఆగడం లేదు. నదీ పరివాహక ప్రాంతంలో ఏదో ఒక మూల తవ్వేస్తూ ఉన్నారు. అధికారులు గానీ, సచివాలయ సిబ్బంది గానీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.
– ఎండి అసిరినాయుడు, ఉపసర్పంచ్, బైరి గ్రామం

ప్రాణాలు తోడేస్తూ!

ప్రాణాలు తోడేస్తూ!