
అర్హులందరికీ భూమి
● ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝి ● రెవెన్యూ వర్క్షాప్ ప్రారంభం
భువనేశ్వర్: రెవెన్యు విభాగం పాలనా వ్యవస్థలో తహసీల్దార్లు వెన్నెముక వంటివారని, ప్రజా ఫిర్యా దులను త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నించాల ని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అన్నారు. తహసీల్దారు కార్యాలయం ప్రజలకు భయానక ప్రదేశంగా కాకూడదని, నమ్మకమైన ప్రదేశంగా ఉండాలని చెప్పారు. స్థానిక లోక్ సేవా భవన్లో బుధవారం రాష్ట్ర రెవెన్యూ అధికారుల సమావేశం, వర్క్షాప్ ప్రారంబించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ భూముల నిర్వహణ వ్యవస్థని ఆధు నీకరించి ప్రజా ఆధారితంగా మార్చేందుకు ప్రభు త్వం కట్టుబడి ఉందని తెలిపారు. దీని ప్రకారం ఒడిశాలో ఎవరూ భూమి లేనివారుగా ఉండరని హామీ ఇచ్చారు. 4 డెసిమల్ కంటే తక్కువ భూమి ఉన్న వారిని కూడా భూమి లేనివారిగా పరిగణిస్తారని, ప్రభుత్వం వారికి సైతం భూమిని అందిస్తుందని చెప్పారు. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో రెవెన్యు అధికారుల పాత్ర కీలకమన్నా రు. విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉందని, అక్రమార్కుల నుంచి ఆ ప్రభుత్వ భూమిని స్వాధీనపరచుకుని సద్వినియోగపరచాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం రెవెన్యూ రంగాలలో అనేక సంస్కరణలను తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. గిరిజనులు, షెడ్యూల్డ్ కులాల భూముల అమ్మకం, కొనుగోలులో తరచుగా అక్రమాలు జరుగుతున్నాయని, వీటికి అడ్డుకట్ట వేయాలన్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు నిర్ధారిత కార్యాచరణ విధానం (ఎస్ఓపీ) ప్రకారం చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. రాష్ట్ర రెవెన్యు, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్ కుమార్ పూజారి మాట్లాడుతూ విధి నిర్వహణలో సాధారణ పని పద్ధతులను మార్చుకు ని సరికొత్త ఆలోచనా విధానంతో ప్రజలకు సేవలందించాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి దేవరంజన్ కుమార్సింగ్, కేంద్ర రెవె న్యూ కమిషనర్ బి.డెమిరియన్, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మనో జ్ ఆహుజా, రాష్ట్ర అభివృద్ధి కమిషనర్ అనూ గర్గ్, అన్ని జిల్లాల డిప్యూటీ కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

అర్హులందరికీ భూమి