
రైతు చైతన్య రథం ప్రారంభం
జయపురం: జయపురం సబ్కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం రైతు చైతన్య రథా న్ని సబ్కలెక్టర్ అక్కవరం శొశ్య రెడ్డి జెండా ఊపి ప్రారంభించార. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో ఎలా విక్రయించాలో అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో సంచరిస్తుంది. ప్రతి సమితిలో మూడు రథాలు ఏర్పాటు చేస్తున్న ట్లు ఆమె వెల్లడించారు. రైతుల సౌలభ్యం కోసం మండీల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. ఏ మండీలో గిడ్డంగి సౌకర్యం లేదో అక్కడ ధాన్యం తడవకుండా తార్పలిన్ సౌకర్యం కల్పిస్తామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వర్షంనీరు నిల్వ ఉండకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు సబ్కలెక్టర్ వెల్లడించారు. టోకెన్ ఉన్న రైతులందరి నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని స్పష్ప చేశారు. రైతులు ధాన్యం శుభ్రపరిచి తీసుకు రావాలని సూచించారు. ధాన్యం అమ్మకంలో ఎటువంటి సమస్య ఎదుర్కొన్న వెంటనే కంట్రోలు రూంకు ఫోను ద్వారా తెలియజేయాలన్నారు. రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్ఎంసీ కార్యదర్శి డైరెక్టర్లు బాలా రాయ్, దేవేంద్ర బాహిణీపతి, నవీణ నాయిక్ పాల్గొన్నారు.