
విజిలెన్స్ వలలో అకౌంటెంట్
పర్లాకిమిడి: పర్లాకిమిడిలో చిన్ననీటి పారుదల శాఖ డివిజన్ కార్యాలయంలో గురువారం ఉదయం బరంపురం విజిలెన్సు అధికారులు జరిపిన దాడులలో అకౌంటెంట్ సూరజ్ ప్రసాద్ జైస్వాల్, కోశాధికారి నరేష్ పట్నాయిక్ దొరికిపోయారు. గజపతి జిల్లా గుసాని సమితి గురండి గ్రామానికి చెందిన సరోజ్ పాత్రో అనే కాంట్రాక్టర్ నాలుగు వర్కు బిల్లులు పాస్ చేయడానికి చిన్ననీటి పారుదలశాఖ డివిజన్ అకౌంటెంట్ సూరజ్ ప్రసాద్ జైశ్వాల్, క్యాషియర్ నరేష్ పట్నాయక్ను సంప్రదించాడు. అయితే వారు రూ.30వేలు లంచం డిమాండ్ చేసినట్టు కాంట్రాక్టర్ తెలియజేశాడు. దీనిపై విజిలెన్స్ అధికారులను సంప్రదించగా వారు మాటు వేసి పట్టుకున్నారు. తర్వాత వారు నివాసం ఉంటున్న క్వార్టర్స్, ఛెలిగడ (ఆర్.ఉదయగిరి)లో అకౌంటెంట్ జైశ్వాల్ ఇల్లు, బ్యాంకు అకౌంట్లు తనిఖీలు చేశారు.

విజిలెన్స్ వలలో అకౌంటెంట్

విజిలెన్స్ వలలో అకౌంటెంట్