మహిళల్లో నాయకత్వ ప్రేరణకు లక్షపతి దీదీ ప్రోత్సాహం: సీఎం | - | Sakshi
Sakshi News home page

మహిళల్లో నాయకత్వ ప్రేరణకు లక్షపతి దీదీ ప్రోత్సాహం: సీఎం

May 30 2025 1:20 AM | Updated on May 30 2025 1:24 AM

భువనేశ్వర్‌: భారత ప్రభుత్వం ఆవిష్కరించిన లక్షపతి దీదీ యోజన మహిళల ఉనికిని కొత్త ఒరవడి దిద్దిందని, ప్రధానంగా గ్రామీణ మహిళల్లో నాయకత్వ లక్షణాల్ని ప్రేరేపించడంలో ఈ చొరవ కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి తెలిపారు. ఈ పథకం కింద మహిళలు ఏటా రూ. 1 లక్షకు పైగా సంపాదించడానికి మార్గం సుగమం చేసిందని, ఉపాధి కల్పనతో ఆర్థిక సాధికారితకు పరిమితం కాకుండా వారిలో నాయకత్వ భావాల్ని ప్రేరేపించడం లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి తెలిపారు. స్థానిక లోక్‌ సేవా భవన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో గురువారం మిషన్‌ శక్తి విభాగం నిర్వహించిన జాతీయ లక్షపతి దీదీ సమావేశం – 2025 సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ సమావేశానికి దేశంలోని 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి లక్షపతి దీదీలు, ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. రాజకీయ రంగంలో మహిళల ప్రాతినిధ్యం కోసం నారీ శక్తి బంధన్‌ చట్టం పార్లమెంటులో ఆమోదం పొందిందని, దీని ద్వారా భావి ఎన్నికలలో కనీసం 33 శాతం మహిళలు లోక్‌ సభ మరియు రాష్ట్ర శాసన సభకు ఎన్నికవుతారని ఆయన అన్నారు. లక్షపతి దీదీ మిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో అమలు చేసిందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యాచరణతో సుమారు 17 లక్షల మంది మహిళలను లక్షాధికారులను చేశామని, ఈ సాఫల్యం జాతీయ స్థాయిలో రాష్ట్రానికి అగ్ర స్థానాన్ని కల్పించిందని అన్నారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు, మిషన్‌ శక్తి, ఒడిశా జీవనోపాధి మిషన్‌ నిజాయితీచ అట్టడుగు స్థాయిలో సమర్థమైన కృషి ఫలితంగా ఈ విజయాన్ని సాధించామన్నారు.

‘రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో మహిళలకు రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నారు. రివాల్వింగ్‌ ఫండ్‌ సహాయం రూ.15,000 నుండి రూ.30,000 కు పెంచారు. కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ను రూ. 35 లక్షల నుంచి రూ. 60 లక్షలకు పెంచారు. ఈ చర్యతో మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులు ఆత్మవిశ్వాసంతో తమ వ్యాపారాన్ని సమర్థంగా నిర్వహించి నిరవధికంగా జీవనోపాధిని పొందగలుగుతున్నారు. సుభద్ర శక్తి మేళా మద్దతుతో సుభద్ర శక్తి కేఫ్‌ మహిళలకు కొత్త జీవనోపాధి నమూనాగా ప్రారంభమైంది. మహిళల దృఢ సంకల్పం మరియు కృషితో వ్యాపారం ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నాయ’ని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా రాయగడ జిల్లాకు చెందిన లక్షపతి దీదీ వింధ్యవాసిని, మహారాష్ట్రకు చెందిన శోభ దిగంబర కదమ్‌ తమ అనుభవాలు, సాఫల్యతనకు సభాముఖంగా పంచుకున్నారు.

దేవ్‌గఢ్‌ జిల్లాకు చెందిన శకుంతల ధొలొ, గజపతి జిల్లాకు చెందిన సులా మి డాల్‌బెహెరా, కేంద్రపడా జిల్లాకు చెందిన మమతా నాథ్‌ శర్మలను ఉత్తమ లక్షపతి దీదీలుగా ఎంపిక చేసి ముఖ్యమంత్రి బహుమతులు ప్రదానం చేశారు. 98 శాతం లక్షపతి దీదీల ఆవిష్కరణతో రాష్ట్ర స్థాయిలో నయాగఢ్‌ జిల్లా అగ్ర స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో కేంద్రాపడా, కటక్‌, భద్రక్‌, జగత్‌సింగ్‌పూర్‌ జిల్లాలు ద్వితీయ స్థానంలో నిలిచాయి. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అధికారిగా ఒడిశా జీవనోపాధి మిషన్‌ అధికారి దేవి ప్రసాద్‌ నాయక్‌ను ముఖ్యమంత్రి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి లక్షపతి దీదీ పథకం సాఫల్యత వీడియో, కాఫీ టేబుల్‌ పుస్తకం మరియు బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సీ్త్ర, శిశు అభివృద్ధి విభాగం మంత్రి ప్రభాతి పరిడా తన ప్రసంగంలో లక్షపతి దీదీ యోజన ఒక ఉద్యమంగా పేర్కొన్నారు. లక్షపతి దీదీల ఆవిష్కరణలో ఒడిశా నిరంతరం అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఈ పథకం ప్రోత్సాహంతో వ్యవసాయం, పశుపోషణ, కుట్టుపని, కేఫ్‌లు వంటి అన్ని రంగాలలో రాష్ట్ర గ్రామీణ మహిళలు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. అభివృద్ధి ప్రక్రియలో మహిళలను భాగస్వామ్యం చేయడానికి ప్రభుత్వం ప్రాముఖ్యత కల్పిస్తుందని రాష్ట్ర అభివృద్ధి కమిషనర్‌, అదనపు ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్‌ అన్నారు. మిషన్‌ ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌ కమిషనర్‌, అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ షాలిని పండిట్‌, డైరెక్టర్‌ డాక్టర్‌ మోనికా ప్రియదర్శిని ఈ కార్యక్రమంలో ధన్యవాదాలను ప్రతిపాదించారు.

జాతీయ లక్షపతి దీదీ సమావేశం

2025– 25 రాష్ట్రాల నుంచి లక్షపతి దీదీలు హాజరు

అగ్రస్థానంలో నయాగఢ్‌ జిల్లా

మహిళల్లో నాయకత్వ ప్రేరణకు లక్షపతి దీదీ ప్రోత్సాహం: సీఎం1
1/2

మహిళల్లో నాయకత్వ ప్రేరణకు లక్షపతి దీదీ ప్రోత్సాహం: సీఎం

మహిళల్లో నాయకత్వ ప్రేరణకు లక్షపతి దీదీ ప్రోత్సాహం: సీఎం2
2/2

మహిళల్లో నాయకత్వ ప్రేరణకు లక్షపతి దీదీ ప్రోత్సాహం: సీఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement