
వంతెన నిర్మాణంలో క్రేన్ కూలి ముగ్గురు మృతి
భువనేశ్వర్: కటక్ ఖాన్ నగర్ ప్రాంతం రింగ్ రోడ్ వంతెన నిర్మాణంలో క్రేన్ కూలిపోవడంతో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా మరో కార్మికుడు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఈ దుర్ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా కొనసాగుతోంది.
కటక్ ఖాన్ నగర్ ప్రాంతంలోని ఒక వంతెన వద్ద శనివారం పనులు జరుగుతుండగా నిర్మాణ పనులకు ఉపయోగించిన క్రేన్ కూలిపోయిన ప్రమాదం జరిగింది. దీంతో కొన్ని స్లాబ్లు కుప్ప కూలాయి. కఠొజొడి నదిపై వంతెన పనులు జరుగుతుండగా కొన్ని భారీ కాంక్రీట్ స్లాబ్లను ఎత్తుతున్న క్రేన్ ప్రమాదవశాదకదే కూలిపోయింది. క్రేన్ కింద పని చేస్తున్న కార్మికులు స్లాబ్ల కింద నలిగిపోయారు. క్షతగాత్రులను కటక్ ఎస్సీబీ మెడికల్ కాలేజీ, ఆస్పత్రి చేర్చారు.
ముఖ్యమంత్రి సంతాపం
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిపై ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబీకులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి ఉచిత చికిత్స, వైద్య సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు వెచ్చిస్తారని పేర్కొన్నారు.
ఇద్దరి పరిస్థితి విషమం