
ఘనంగా సాహిత్య సంసద్ వార్షికోత్సవం
జయపురం: ఛండనొయి సాహిత్య సంసద జయపురం శాఖ వార్షికోత్సవం స్థానిక లోకేశ్వరి కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో శుగ్రవారం ఘనగా జరిగింది. ఉత్సవంలో ప్రముఖ సాహితీ వేత్త డాక్టర్ సురేష్ దాస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. శ్రీజగన్నాధుని చిత్రపటానికి పూల మాలలు వేసి పూజించిన తరువాత ఛిండినొయి సాహత్య సంసద్ కొరాపుట్ జిల్లా అధ్యక్షుడు యుధిస్టర్ మల్లిక్ అధ్యక్షతన జరిగిన వార్షికోత్సవంలో ముఖ్యవక్తగా ఆదివాసీ భాష పరిశోధకులు డాక్టర్ రాజేంద్రపాఢీ, గౌరవ అతిథిగా అధ్యాపకులు డాక్టర్ సుధాంశు శేఖర పట్నాయక్ హాజరై సమాజాన్ని చైతన్య పరచటంలో సాహిత్య ప్రభావాన్ని వివరించారు. ఛిండినొయి సాహత్య సంసద్ వార్షికోత్సవం ముఖ పత్రం శుభశ్రీ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఔత్సాహిక రచయితలు నేటి సమాజ పరివర్తనలో సాహిత్య భూమికపై చర్చించారు. చర్చలలో భైరాగి చరణ సాహు, విజయ లక్ష్మి పాణిగ్రహి, ప్రమోద్ కుమార్ రౌళొ, అశోక్ పొలాయ్, భావ చంద్రికా దేవి, అజయ మల్లిక్, డోలి నాయిక్, నారాయణ సాగర్, ఘాశీరాం మహాపాత్రో, శుభశ్రీ పట్నాయక్, రాజశ్రీస్వై, అభిలాష్ శాంత పాత్రో, శుభశ్రీ పాత్రో, సంఘమిత్ర భుక్త పాల్గొన్నారు. ప్రముఖ కవులు, కవియిత్రిలు తమ శ్వీయ రచనలను వినిపించారు. నిరంజన్ పాణిగ్రహి, సంతోష్ నాయిక్, నికుంజ రంజనీ మహంతి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

ఘనంగా సాహిత్య సంసద్ వార్షికోత్సవం