
త్రుటిలో తప్పిన ప్రమాదం
రాయగడ: బిసంకటక్ నుంచి పర్శాలికి వెళ్తున్న లక్ష్మీ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. బుధవారం ఈ ఘటన పాతలొంబ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ఉదయం ప్రయాణికులతో బిసంకటక్ నుంచి బయల్దేరిన బస్సు పాతలొంబ గ్రామానికి చేరేసరికి మలుపు వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకుపోయింది. గత రెండు రోజులుగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో మలుపు వద్ద మట్టి పేరుకుపోయింది. దీంతో బస్సు అదుపుతప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. అయితే ఎవరికీ ఎటువంటి గాయాలవ్వకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
పిడుగుపాటుకు 11 ఆవులు మృతి
కొరాపుట్: పిడుగుపాటుకి 11 ఆవులు మృతి చెందిన ఘటన కొరాపుట్ జిల్లా నారాయణపట్న సమితి సంగల్బెడా గ్రామ పంచాయతీ పుల్బాడి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఆవుల మందపై పిడుగులు పడడంతో మొత్తం 11 ఆవులు మృత్యువాత పడ్డాయి. దీంతో యజమానులు విలపిస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
పథకాలను రైతులు
సద్వినియోగం చేసుకోవాలి
పర్లాకిమిడి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బిజయకుమార్ దాస్ అన్నారు. బుధవారం రైతు దినోత్సవం, పవిత్ర అక్షయ తృతీయ సందర్భంగా జిల్లా వ్యవసాయ మరియు కృషక్ స్వశక్తీకరణ ఆధ్వర్యంలో బి.ఎన్.ప్యాలస్ రోడ్డులో అధికారులు దుక్కులు దున్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో, జిల్లా ముఖ్య వ్యవసాయ అధికారి రవీంద్రకుమార అఢెక్, జల విభాజన మరియు ప్రాజెక్టు డైరక్టర్ సురేష్ కుమార్ పట్నాయిక్, ఉద్యానవనాల శాఖ ఉపసంచాలకులు సుశాంత్ రంజన్ దాస్, అదనపు ప్రాణి చికిత్సా అధికారి డాక్టర్ రమాకాంత రోణా తదితరులు పాల్గొన్నారు.
నూతన భవనం ప్రారంభం
పర్లాకిమిడి: స్థానిక తెలుగు సొండివీధి సరస్వతీ శిశు విద్యామందిర్ సమీపంలో వందేమాతరం నృత్య, సంగీత పాఠశాల నూతన భవనాన్ని బుధవారం జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు ప్రారంభించారు. సుమారు 23 సంవంత్సరాల నుంచి ఈ నృత్య, సంగీత అకాడమీ అద్దె భవనంలో నడుస్తోంది. ప్రస్తుతం ఈ సంగీత, నృత్య అకాడమీలో 32 మంది విద్యార్థులు, 5 మంది గురువులు శిక్షణ అందిస్తున్నారు. కార్యక్రమంలో అధ్యక్షుడు బసంతకుమార్ పట్నాయిక్, రాజీవ్ లోచన పండా, రబి పాణిగ్రాహి, అమూల్య పాత్రో, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.

త్రుటిలో తప్పిన ప్రమాదం

త్రుటిలో తప్పిన ప్రమాదం