
ఘనంగా సుదర్శన హోమం
రాయగడ: కొలనార సమితి అమలాభట్ట వద్ద గల శ్రీక్షేత్ర టౌన్షిప్లో ఉన్న శ్రీలక్ష్మీనృసింహుని మందిరంలో మంగళవారం నుంచి చందనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు మంగనాధ్ ఆచార్యులు, స్థానిక బాలాజీ నగర్లో గల కల్యాణ వేంకటేశ్వర మందిరానికి చెందిన ప్రధాన అర్చకులు రాంజీ ఆచార్యుల ఆధ్వర్యంలో లక్ష్మీనృసింహ స్వామికి ఉదయం ఆరాధన, చందనాభిషేకాలు, ప్రత్యేక పూజలతో పాటు సుదర్శన హోమం నిర్వహించారు. బుధవారం సాయంత్రం స్వామి కల్యాణోత్సవాలు అత్యంత ఘనంగా జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆలయ ధర్మకర్త దూడల శ్రీనివాస్ తెలియజేశారు.