ముగిసిన రెడ్‌క్రాస్‌ శిక్షణ శిబిరం | - | Sakshi
Sakshi News home page

ముగిసిన రెడ్‌క్రాస్‌ శిక్షణ శిబిరం

Apr 29 2025 9:41 AM | Updated on Apr 29 2025 9:41 AM

ముగిసిన రెడ్‌క్రాస్‌ శిక్షణ శిబిరం

ముగిసిన రెడ్‌క్రాస్‌ శిక్షణ శిబిరం

జయపురం: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ప్రారంభమైన రాష్ట్రస్థాయి జూనియర్‌ రెడ్‌క్రాస్‌ శిక్షకుల శిక్షణ శిబిరం సోమవారం సాయంత్రం సెమిలిగుడ ఉన్నత పాఠశాలలో ముగిసిందని నిర్వాహకులు తెలిపారు. సోమవారం ప్రధమ కార్యక్రమంలో సాధన కర్మి రామచంద్ర పాల్‌హెచ్‌ఐబీ, ఎయిడ్స్‌లపై వివరించి వాటి నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తలుప వివరించినట్లు వెల్లడించారు. ముగింపు కార్యక్రమంలో అగ్నిమాపక విభా గ అధికారి శ్రీపతి స్వైయ్‌ అగ్ని ప్రమాదాలలో బాధితులను రక్షించటంలో రెడ్‌ క్రాస్‌ కార్యకర్తలు అనుపరించాల్సిన పద్ధతులను వివరించారు. రాష్ట్ర జూనియర్‌ రెడ్‌క్రాస్‌ సాధన కర్మి యజ్ఞేశ్వర పండ ప్రకృతి ప్రమాదాలలో అనుసరించాల్సిన విధానాలు, బాధితుల రక్షణలో తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేశారు. జూనియర్‌ రెడ్‌క్రాస్‌ అధికారి హరేకృష్ణ మహారాణ అధ్యక్షతన రెండవ అధివేషన్‌ జరిగింది. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ జీవిత కాల సభ్యులు షేక్‌ ఇబ్రహిమ్‌, జగన్నాథ్‌ విద్యాపీఠం, సునాబెడ ప్రధాన ఉపాధ్యాయులు సిద్దార్థ మహాపాత్రో రెడ్‌క్రాస్‌ ప్రాధాన్యతను వివరించారు. మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేసినవారికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ముగింపు కార్యక్రమంలో జ్యోతిరంజన్‌ నంద, సపన్‌ దీక్షిత్‌, తపన పొరిడ, సాహెబ్‌ పరవిన్‌, శుభక్ష్మిత సాహు, అశోక్‌ కుమార్‌ పవడ పాల్గొన్నారు. సెమిలిగుడ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు విష్ణుప్రియ సామంతసింహార్‌ ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement