
పారాదీప్లో అగ్ని ప్రమాదం
భువనేశ్వర్: పారాదీప్ జీరో పాయింట్ ప్రాంతం స్టాక్ యార్డ్లో సోమవారం భయానక అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్ పూతతో కూడిన ఇనుప పైపుల పోగులో మంటలు చెలరేగాయి. 10 యూనిట్లు పైబడి కుజంగ్ అగ్ని మాపక దళం రంగంలోకి దిగి మంటలను అదుపు చేసింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) చమురు పైప్ లైన్ వేయడం జరుగుతోంది. మంటల్లో కోట్లాది రూపాయల విలువైన పైపులు కాలి బూడిదయ్యాయి. ఈ పైపులు ద్రవ పెట్రోలియం ఉత్పత్తులను భూగర్భం గుండా రవాణా చేయడానికి ఉద్దేశించినవి. జగత్సింగ్పూర్ జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంటు, స్థానిక ఠాణా ఇనస్పెక్టరు ఇంచార్జి ప్రత్యక్షంగా ఘటనా స్థలం సందర్శించారు. ప్రమాదం తీవ్రతని సమీక్షించారు. మంటలను అదుపులోకి తెచ్చిన తర్వాత దానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు చేశామని అధికారులు తెలిపారు.

పారాదీప్లో అగ్ని ప్రమాదం