
నీట్ సూపర్ స్పెషాలిటీ పరీక్షలో టాపర్ యష్ జైన్
భువనేశ్వర్: బొలంగీర్ జిల్లా కంటాబంజీకి చెందిన యష్ జైన్ నీట్ సూపర్ స్పెషాలిటీ (ఎస్ఎస్) పరీక్షలో అగ్రస్థానంలో నిఉత్తీర్ణత సాధించాడు. ఆయన జనరల్ సర్జరీలో స్పెషలిస్ట్. ముంబైలోని కేఈఎం హాస్పిటల్ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ఆ తర్వాత నాగ్పూర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యను పూర్తి చేశాడు. గత మూడేళ్లుగా ఆ ఆస్పత్రిలో రోగులకు సేవ చేస్తున్నాడు. నీట్ సూపర్ స్పెషాలిటీ ప్రవేశ పరీక్షలో రాష్ట్రంలో కంటాబంజికి చెందిన యష్ కుమార్ జైన్ కు విపక్ష నేత నవీన్ పట్నాయక్ అభినందనలు తెలిపారు. తన వృత్తి జీవితంలో మరింత ప్రకాశవంతంగా ప్రకాశించి రాష్ట్రం గర్వపడేలా చేయాలని నవీన్ పట్నాయక్ ఆకాంక్షించారు.