
సహకార బ్యాంక్ల అభివృద్ధికి కృషి చేయాలి
కొరాపుట్: సహకార రంగ బ్యాంక్ల అభివృద్ధికి ఉద్యోగులు కృషి చేయాలని కొరాపుట్ సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు ఈశ్వర్ చంద్ర పాణిగ్రాహి పిలుపునిచ్చారు. ఆదివారం జయపూర్ కేసీసీ బ్యాంక్ ఆవరణలో జరిగిన రాష్ట్ర సహకార సంఘ బ్యాంక్ ఉద్యోగుల జనరల్ బాడీ సమావేశంలో ప్రసంగించారు. ప్రైవేట్ రంగ బ్యాంక్ల నుంచి వస్తున్న సవాళ్లను ఎదుర్కోవడానికి సహకార బ్యాంక్లు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. తొలుత పెహల్గాం మృతులకు నివాళులర్పించారు. ఈ కార్యాక్రమంలో ఆల్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరి కె.వి.ఎస్.రవికుమార్, రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్, కార్యదర్శులు ప్రభాత్ మిశ్ర, కేసీసీ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ దిగంబర్ నాయక్, కార్యదర్శి అరుణ్ మిశ్ర, 17 బ్యాంక్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.