చిరస్మరణీయులు | - | Sakshi
Sakshi News home page

చిరస్మరణీయులు

Apr 27 2025 1:20 AM | Updated on Apr 27 2025 1:20 AM

చిరస్

చిరస్మరణీయులు

శ్రీకృష్ణచంద్ర గజపతి

రాయగడలో..

రాయగడ: పర్లాకిమిడి మహారాజు కృష్ణచంద్ర గజపతి జయంతిని పురస్కరించుకుని శనివారం స్థానిక తృప్తి కూడలిలో గల గజపతి విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సీనియర్‌ పాత్రికేయుడు అమూల్య రత్న సాహు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు మనోజ్‌ రొథొ, మున్సిపాలిటీ చైర్మన్‌ మహేష్‌ పట్నాయక్‌ తదితరులు పాల్గొని పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. జిల్లా అదనపు కలక్టర్‌ రమేష్‌ చంద్ర నాయక్‌ ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటకు గజపతి అందించిన సేవలను కొనియాడారు. మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌ శుభ్ర పండ, సెంచురియన్‌ డైరక్టర్‌ రాజేష్‌ పాడి, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంత కుమార్‌ ప్రధాన్‌ తదితరులు పాల్గొన్నారు.

పర్లాకిమిడి: మహారాజా శ్రీకృష్ణచంద్రగజపతి నారాయణ దేవ్‌ 134 వ జయంతి వేడుకలు పట్టణంలో మార్కెట్‌, చిత్రకారవీధి జంక్షన్‌ వద్ద ఘనంగా జరిగాయి. బరంపురం ఎంపీ డాక్టర్‌ ప్రదీప్‌ కుమార్‌పాణిగ్రాహి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆయన స్మృతి చిహ్నం వద్ద పుష్పాంజలి అర్పించారు. అలాగే కలెక్టర్‌ బిజయకుమార్‌ దాస్‌, పురపాలక ఈఓ లక్ష్మణ మురుమ, సరస్వతీ శిశు మందిర్‌ ఉపాధ్యాయులు ఆయన మూర్తికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పురపాలక సంఘం కార్యాలయంలో చైర్మన్‌ నిర్మలా శెఠి మహారాజా విగ్రహానికి పూలమాలలు వేశారు. స్థానిక మృదంగం వీధి వద్ద ఉన్న కృష్ణచంద్రగజపతి సమాధి వద్ద గజపతి వంశీయురాలు కల్యాణి దేవి గజపతి తొలుత పుష్పమాలలు వేసి స్మరించారు.

కృష్ణచంద్ర గజపతి నారాయణదేవ్‌ సేవలు

అనీర్వచనీయం

పర్లాకిమిడి: ప్రత్యేక ఒడిశా కోసం పర్లాకిమిడి మహారాజా కృష్ణచంద్రగజపతి నారాయణ దేవ్‌ చేసిన సేవలు అనిర్వచనీయం అని బరంపురం ఎంపీ ప్రదీప్‌ కుమార్‌ పాణిగ్రాహి అన్నారు. కలెక్టరేట్‌ వద్ద గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం హాలులో కృష్ణచంద్రగజపతి 134 జయంతి వేడుకలపై జరిగిన సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒడిశా ప్రత్యేక రాష్ట్రం కోసం తన సొంత నిధులు ఖర్చుపెట్టడమే కాకుండా విలువైన సమయాన్ని వెచ్చించి ప్రత్యేక స్వతంత్ర ఒడిశా ఏర్పాటుకు పర్లాకిమిడి మహారాజా కృష్ణచంద్ర గజపతి నారాయణదేవ్‌ కృషి చేశారని గుర్తు చేశారు. ఒడిశాలో ఏ జిల్లాకు లేని పంట పొలాలకు అనేక ఎత్తిపోత పథకాలు, ఆయకట్టలు, సాగరాలు నిర్మించారని తెలిపారు. ఇంగ్లండ్‌లోని బంకింగ్‌హామ్‌ ప్యాలస్‌ నమూనా తీసుకుని పర్లాకిమిడిలో గజపతి ప్యాలెస్‌ను నిర్మించారని అన్నారు.

కొరాపుట్‌లో..

కొరాపుట్‌: పర్లాకిమిడి మహరాజు కృష్ణచంద్ర గజపతి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం కొరాపుట్‌, నబరంగ్‌పూర్‌ జిల్లాలో ప్రభుత్వం తరఫున అధికారికంగా సభలు, సమావేశాలు నిర్వహించారు.కవులు,మేదావులు పెద్ద ఎత్తున్న నివాళులు అర్పించారు.

చిరస్మరణీయులు1
1/3

చిరస్మరణీయులు

చిరస్మరణీయులు2
2/3

చిరస్మరణీయులు

చిరస్మరణీయులు3
3/3

చిరస్మరణీయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement