
88 కిలోల గంజాయి పట్టివేత
జయపురం: సరుకులు రవాణా చేసే ఒక టాటా మేజిక్ వాహనంలో 88 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు బొయిపరిగుడ పోలీసు అధికారి రక్ష్మీరంజన్ ప్రధాన్ శుక్రవారం వెల్లడించారు. ఒక టాటా మేజిక్ వాహనంలో రాత్రిళ్లు గంజాయి రవాణా చేస్తున్నట్లు సమాచారం అందడంతో.. గురువారం సాయంత్రం పోలీసు అధికారి ఆదేశం మేరకు సబ్ఇన్స్పెక్టర్ సంజీవ్ కుమార్ బెహర నేతృత్వంలో పోలీసు టీమ్ ఖొరాగుడ గ్రామ ప్రాంతంలో పెట్రోలింగ్ జరిపింది. దీంతో అటుగా వస్తున్న టాటా మేజిక్ వాహనం పోలీసులను గమనించడం.. బండిని అక్కడే వదిలి వాహనంలో ఉన్నవారంతా పారిపోయారు. వాహనం వద్దకు వెళ్లి తనిఖీ చేయగా.. గంజాయి దొరికింది. వెహికల్ నంబర్ ఆధారంతో గంజాయి వ్యాపారం చేస్తున్న నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసు అధికారి వెల్లడించారు.