పర్లాకిమిడి: భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటిని వృథా చేయవద్దని జిల్లా శిశు సురక్షా సమితి అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి సూచించారు. స్థానిక బెత్తగుడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇండియన్ సొసైటీ ఫర్ రూరల్ డవలప్మెంట్, వన్స్టాప్ సెంటర్లో ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గజపతి జిల్లాలో నీటి వనరులు రోజురోజుకూ తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గుమ్మా, నువాగడ సమితుల్లో ఈ ప్రభావం ఎక్కువుగా ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారని సుభానీ పాణిగ్రాహి అన్నారు. కార్యక్రమంలో క్లస్టర్ అసోసియేట్ సునీతా రథ్, యాక్షన్ ఎయిడ్ జిల్లా కో–ఆర్డినేటర్ శేషదేవ భోయి, పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు బబులీ నాయక్, వర్షారాణి మిశ్రా తదితరులు పాల్గొన్నారు.