తక్షణమే స్పందిస్తే ప్రాణ నష్టాన్ని తగ్గించగలం | - | Sakshi
Sakshi News home page

తక్షణమే స్పందిస్తే ప్రాణ నష్టాన్ని తగ్గించగలం

Jun 25 2025 7:12 AM | Updated on Jun 25 2025 7:12 AM

తక్షణమే స్పందిస్తే ప్రాణ నష్టాన్ని తగ్గించగలం

తక్షణమే స్పందిస్తే ప్రాణ నష్టాన్ని తగ్గించగలం

తాడేపల్లి రూరల్‌: అనుకోని విపత్తులు సంభవించినప్పుడు తక్షణమే స్పందిస్తే ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకట్‌ దీపక్‌ అన్నారు. తాడేపల్లి పరిధిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో ‘ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రి సంసిద్ధత’పై ఎయిమ్స్‌ వైద్యులు, ఆంధ్ర, తెలంగాణ, పుదుచ్చేరి, చత్తీస్‌గడ్‌కు చెందిన 30 మంది వైద్యులకు మంగళవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్‌ దీపక్‌ మాట్లా డుతూ.. విపత్తుల ముందు, ఆ తరువాత అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులు, డాక్టర్లు విపత్తుల ప్రమాద తగ్గింపునకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. మంగళగిరి ఎయిమ్స్‌లోని నిర్మాణాత్మక పరికరాలు, అనుభవం కలిగిన డాక్టర్లు, మెడిసిన్‌, టెస్టింగ్‌ పరికరాలు, బ్లడ్‌బ్యాంక్‌ వంటి ఇతర వివరాలను అందజేయాలని సూచించారు. సమావే శంలో ఎయిమ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ హెచ్‌ఓడీ డాక్టర్‌ రామమోహన్‌, డాక్టర్‌ రమ్యజ్యోతి, విపత్తుల సంస్థ అధికారులు ఆర్‌ఎస్‌ఐ మధుబాబు, జీఐఎస్‌ ఎక్స్‌పర్ట్‌ హరీష్‌, ప్రాజెక్ట్‌ మేనేజర్లు బస్వంత్‌, కిషోర్‌, సతీష్‌, పూర్ణచంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement