సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె బాట | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె బాట

Jun 25 2025 7:12 AM | Updated on Jun 25 2025 7:14 AM

ఏపీఎస్‌ఈబీ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఏపీసీపీడీసీఎల్‌, ఏపీ ట్రాన్స్‌కో ఇంజినీర్లు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైందని ఏపీఎస్‌ఈబీ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ రామారావు, ప్రధాన కార్యదర్శి నాగప్రసాద్‌ పేర్కొన్నారు. యాజమాన్యం స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. ఇప్పటికే సమ్మె నోటీసులు ఇచ్చామని గుర్తుచేశారు. విజయవాడలో ఏపీఎస్‌ఈబీ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ సమావేశం మంగళవారం జరిగింది. సమ్మె నోటీసు, 1999 నుంచి 2004 మధ్య నియమితులైన వారికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి జీపీఎఫ్‌ ఇవ్వాలన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఏఈఈల నియామకం తక్షణం చేపట్టాలని, ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, ఎర్న్‌డ్‌ లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని సమావేశం డిమాండ్‌ చేసింది. సమావేశంలో అసోసియేషన్‌ అసోసి యట్‌ ప్రెసిడెంట్‌ రామారావు మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యుత్‌ శాఖలో ఖాళీలను భర్తీ చేయడం లేదని ఇంజినీర్లపై అధిక పనిభారం మోపుతోందని పేర్కొన్నారు. ఇంక్రిమెంట్లు ఇవ్వడం లేదని, ట్రైపార్టీ అగ్రిమెంట్‌ను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. ఇంజినీర్లకు పీఆర్సీ 2022లో తీరని అన్యాయం జరిగిందని గుర్తుచేశారు. ఈ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మె బాట పట్టడం తప్ప మరో మార్గంలేదని తేల్చిచెప్పారు. అనంతరం అసోసియేషన్‌కు విశిష్ట సేవలందించి ఇటీవల పదవీ విరమణ చేసిన బి.వి.నాగేశ్వర రావును సత్కరించారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు వంశీ, ఇర్ఫాన్‌, కృష్ణప్రసాద్‌, కంపెనీ నాయకులు రాజేష్‌ ఖన్నా, నాగేశ్వరరావు, జిల్లా నాయకులు ఎం.వి.వి.రామకృష్ణ, బి.రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement