ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ను కలిసిన డీఐపీఆర్‌ఓ | - | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ను కలిసిన డీఐపీఆర్‌ఓ

Jun 25 2025 7:14 AM | Updated on Jun 25 2025 11:40 AM

గాంధీనగర్‌(విజయవాడ సెంట్రల్‌ ): సమాచార పౌర సంబంధాల శాఖ ఎన్టీఆర్‌ జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన కె.వి.రమణారావు మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ జి.లక్ష్మీశను మర్యాదపూర్వకంగా కలిశారు. ఏలూరు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తున్న రమణారావును ఎన్టీఆర్‌ జిల్లాకు బదిలీ చేస్తూ సమాచార డైరెక్టర్‌ ఉత్వర్తులు జారీ చేశారు. ప్రస్తుతం జిల్లా పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తున్న యు.సురేంద్రనాథ్‌ నుంచి రమణరావు బాధ్యతలు స్వీకరించారు. 

ప్రభుత్వ శాఖల్లో అత్యంత కీలకమైన సమాచార పౌరసంబంధాల శాఖలో డీఐపీఆర్‌ఓగా సమర్థంగా పని చేసి ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడంతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధుల మధ్య సమన్వయం చేస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని రమణరావుకు జిల్లా లక్ష్మీశ సూచించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో డీఐపీఆర్‌ఓ వెంట డీపీఆర్‌ఓ ఎస్‌.వి.మోహన్‌ రావు, డివిజనల్‌ పీఆర్‌ఓ కె.రవి, ఏవీఎస్‌ వి.వి.ప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

సమస్యలు పరిష్కరించాలని సచివాలయ ఉద్యోగుల వినతి

చిలకలపూడి(మచిలీపట్నం): తమ సమస్యలను పరిష్కరించాలని, రేషన్‌లైజేషన్‌, బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకుడు జి.గోపీచంద్‌ కోరారు. ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్‌ డి.కె.బాలాజీకి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోపీ చంద్‌ మాట్లాడుతూ.. వార్డు సచివాలయాలకు వార్డు టు వార్డు బదిలీలకు అవకాశం కల్పించాలన్నారు. బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని, సీనియార్టీ, మెరిట్‌ ప్రాతిపదికన బదిలీలు నిర్వహించాలని కోరారు. రేషనలైజేషన్‌ ప్రక్రియలో మిగులు ఉద్యోగులను ఏ డిపార్టుమెంట్‌లోకి తీసుకుంటారో ఇంత వరకు సమాచారం లేదని, జాబ్‌చార్ట్‌, డిపార్ట్‌మెంట్‌ పరిధి తెలియజేసి రేషనలైజేషన్‌ ప్రక్రియ చేపట్టాలని విజ్ఞప్తిచేశారు. ఈ సమ్యలన్నింటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి కృష్ణాజిల్లా అధ్యక్షుడు ఎం.వి.శ్యామ్‌నాథ్‌, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

కోటిలింగాలను దర్శించుకున్న హంపీ పీఠాధిపతి

ముక్త్యాల(జగ్గయ్యపేట): గ్రామంలోని కోటిలింగ హరిహర మహా క్షేత్రంలోని అమృతలింగేశ్వర స్వామిని జగద్గురు ఆదిశంకరాచార్య హంపీ పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామీజీ మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ హరిదుర్గానాగేశ్వరరావు పూర్ణకుంభంతో స్వామీజీకి స్వాగతం పలికారు. అనంతరం అమృతలింగేశ్వర స్వామికి పీఠాధిపతి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోటిలింగాల సమీపంలోని హంపీ పీఠం మొదటి వార్షికోత్సవంలో భాగంగా వచ్చామన్నారు. భక్తులకు ఆధ్యాత్మిక సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో విశ్రాంత ఈఓ దూళిపాళ్ల సుబ్రహ్మణ్యం, అర్చ కులు తేజ, హర్ష, సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ను కలిసిన డీఐపీఆర్‌ఓ 1
1/1

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ను కలిసిన డీఐపీఆర్‌ఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement