ఈవీఎంల గోడౌన్‌ భద్రతపై ప్రత్యేక దృిష్టి పెట్టండి | - | Sakshi
Sakshi News home page

ఈవీఎంల గోడౌన్‌ భద్రతపై ప్రత్యేక దృిష్టి పెట్టండి

Jun 24 2025 4:19 AM | Updated on Jun 24 2025 4:19 AM

ఈవీఎంల గోడౌన్‌ భద్రతపై ప్రత్యేక దృిష్టి పెట్టండి

ఈవీఎంల గోడౌన్‌ భద్రతపై ప్రత్యేక దృిష్టి పెట్టండి

భవానీపురం(విజయవాడపశ్చిమ): ఈవీఎం, వీవీ ప్యాట్ల గోడౌన్‌ భద్రత, పటిష్టతపై ప్రత్యేక దృష్టి పెట్టి నిరంతర పర్యవేక్షణ జరగాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్‌ యాదవ్‌ ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించిన గోడౌన్‌ల సాధారణ తనిఖీల్లో భాగంగా ఆయన సోమవారం విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడిలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో గల ఈవీఎం, వీవీ ప్యాట్లను భద్రపరిచే గోడౌన్‌ను అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్‌లో సంతకం చేశారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, వివిధ పార్టీల నాయకులు యేదుపాటి రామయ్య, తరుణ్‌ కాకాని, కె.పరమేశ్వరరావు, ఎ.నాగేంద్రప్రసాద్‌, కలెక్టరేట్‌ ఎలక్షన్‌ సెల్‌ డెప్యూటీ తహసీల్దార్‌ గోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్‌ యాదవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement