
రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలకు ఎంపిక
పెనమలూరు: రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలకు ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి క్రీడాకారులను ఎంపిక చేశామని జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బి.మనోహర్, తాళ్లూరి అశోక్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం వివరాలు తెలుపుతూ రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు ఈ నెల 22న పోట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యాన కావలిలో జరుగుతాయన్నారు. క్రీడా కారులను ఆదివారం మనోహర్ జిమ్లో ఎంపిక చేశామని తెలిపారు. క్రీడాకారుల వివరాలు ఇలా ఉన్నాయి.
– 62 కేజీల విభాగంలో ఏసు, 65 కేజీల విభాగంలో ఎస్కే బాజిబాబా, 68 కేజీల విభాగంలో ఎం.దినేష్, 70 కేజీల విభాగంలో సూర్య, 73 కేజీల విభాగంలో పృధ్వీకృష్ణ, 75 కేజీల విభాగంలో వి.రాహుల్కృష్ణ, 75 కేజీల విభాగంలో కె.కొండల్ను ఎంపిక చేశామన్నారు. స్పోర్ట్స్ ఫిజిక్లో 160 సెంటీ మీటర్ల లోపు ఎం.దినేష్, శ్రీనును ఎంపిక చేశామని తెలిపారు. ఎంపికైన క్రీడాకారులకు కానూరు అశోక్ జిమ్లో ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు, పలు జిమ్ల నిర్వాహకులు పాల్గొన్నారు.