ప్రపంచ పర్యావరణ సంస్థ ఏపీ చాప్టర్‌ అధ్యక్షుడిగా భార్గవ్‌ కుమార్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రపంచ పర్యావరణ సంస్థ ఏపీ చాప్టర్‌ అధ్యక్షుడిగా భార్గవ్‌ కుమార్‌

May 30 2025 1:16 AM | Updated on May 30 2025 1:16 AM

ప్రపం

ప్రపంచ పర్యావరణ సంస్థ ఏపీ చాప్టర్‌ అధ్యక్షుడిగా భార్గవ్

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ప్రపంచ పర్యావరణ సంస్థ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడిగా బి.ఎస్‌ భార్గవ్‌ కుమార్‌, ఆ సంస్థ గౌరవ చైర్‌ పర్సన్‌గా డాక్టర్‌ జి.అనిత నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంస్థ ఫౌండర్‌ సీహెచ్‌ భద్ర వివరాలు చెబుతూ.. అంకిత భావం గల సంస్థకి సరైన వ్యక్తులను నియమించాలనే ఉద్దేశంతో ఏపీ చాప్టర్‌కు బీఎస్‌ భార్గవ్‌ కుమార్‌ను నియమించినట్లు తెలిపారు. జర్నలిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించి తదనంతరం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జర్నలిజం డిపార్ట్‌మెంట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేశారని, ప్రస్తుతం ఏపీ హై కోర్ట్‌లో అడ్వకేట్‌గా పని చేస్తున్నారన్నారు. అలాగే ఎంతో మంది జర్నలిస్ట్‌లను సమాజానికి అందించిన ప్రొఫెసర్‌ జి. అనితను గౌరవ చైర్‌ పర్సన్‌గా ఎన్నుకున్నామని, భవిష్యత్‌లో ఆమె మార్గదర్శకత్వంలో అందరం కలిసి పని చేస్తామన్నారు.

ప్రపంచ పర్యావరణ సంస్థ ఏపీ చాప్టర్‌ అధ్యక్షుడిగా భార్గవ్1
1/1

ప్రపంచ పర్యావరణ సంస్థ ఏపీ చాప్టర్‌ అధ్యక్షుడిగా భార్గవ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement