దుక్కుల్లో దుఃఖం | - | Sakshi
Sakshi News home page

దుక్కుల్లో దుఃఖం

May 31 2025 1:29 AM | Updated on May 31 2025 1:45 AM

విజయవాడ సిటీ
ఎన్టీఆర్‌ జిల్లా
శనివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2025
ఏడాదిగా అతీగతీలేక అన్నదాత ఆక్రందన
● సాగులో అడుగడుగునా గండాలు ● పండిన పంటకు గిట్టుబాటు దక్కక ఆవేదన ● ప్రకృతి విపత్తులతో నష్టపోతే ఆదుకోని సర్కారు ● వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ కూటమి ఏడాది పాలన

జిల్లాలో పరిస్థితి..

కృష్ణాజిల్లా వ్యాప్తంగా 2,09936 మంది, ఎన్టీఆర్‌ జిల్లాలో 1.21 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరితో పాటు 3.30 లక్షల మంది కౌలురైతులు ఉన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 785 గ్రామాల్లో 600 రైతు సేవా కేం ద్రాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి.

చైర్‌పర్సన్‌ ఎన్నికకు

భారీ బందోబస్తు

తిరువూరు: తిరువూరు నగరపంచాయతీ చైర్‌ పర్సన్‌ ఎన్నిక సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. గత రెండు విడతల్లో చైర్‌పర్సన్‌ ఎన్నిక ప్రక్రియకు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అడుగడుగునా అడ్డుతగిలి కౌన్సిలర్లను ఎన్నికల్లో ఓటు వేసేందుకు రానీయకుండా ఇబ్బందుల పాలు చేయడంతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొనడంతో చైర్‌పర్సన్‌ ఎన్నిక వాయిదా వేశారు. మళ్లీ జూన్‌ 2న చైర్‌పర్సన్‌ ఎన్నిక నిర్వహణకు ప్రిసైడింగ్‌ అధికారి, ఆర్డీవో కె. మాధురి కౌన్సిలర్లకు నోటీసులు జారీ చేశారు. ఏసీపీ ప్రసాదరావు ఆధ్వర్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

బంగారు నగలు ఉన్న

పర్సు అప్పగింత

అవనిగడ్డ: ఆర్టీసీ బస్‌లో మర్చిపోయిన బంగారు నగలు ఉన్న పర్సుని తిరిగి ఆ ప్రయాణికురాలికి అప్పగించిన ఘటన శుక్రవారం జరిగింది. డిపో మేనేజర్‌ కె.హనుమంతరావు తెలిపిన వివరాల ప్రకారం అవనిగడ్డకు చెందిన ఉడతా వెంకట రమణమ్మ ఆర్టీసీ బస్సులో విజయవాడ నుంచి అవనిగడ్డకు వచ్చింది. ఇంటికి వెళ్లిన తరువాత తన వద్ద ఉండాల్సిన కవర్‌ కనిపించక పోవడంతో మనవడిని ఆర్టీసీ డిపోకి పంపించింది. అప్పటికే ఆ బస్‌ గ్యారేజీలోకి వెళ్లగా సిబ్బంది క్లీనింగ్‌ చేస్తున్నారు. బస్‌లో వెనుక సీటులో కవర్‌ కనబడింది. అందులో ఉన్న పర్స్‌ చూడగా రూ.1.50 లక్షల విలువగల బంగారు గొలుసు, రూ.890 నగదు ఉన్నాయి. అనంతరం వాటిని డిపో మేనేజర్‌ ద్వారా ప్రయాణికురాలికి అందించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ మేనేజర్‌ శ్రీలక్ష్మి, ఆర్టీసీ సెక్యూరిటీ హెడ్‌ రాఘవయ్య, డీసీ బి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

ప్లాస్టిక్‌ జార్‌లలో

విజయ నెయ్యి

చిట్టినగర్‌(విజయవాడపశ్చిమ): కృష్ణా మిల్క్‌ యూనియన్‌ (విజయ డెయిరీ) ప్లాస్టిక్‌ జార్‌లలో ఆవు, గేదె నెయ్యిలను అందిస్తున్నామని చైర్మన్‌ చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు. పాలప్రాజెక్టులోని పరిపాలనా భవనంలో శుక్రవారం చైర్మన్‌ చలసాని ఆంజనేయులు మీడి యా సమావేశం ఏర్పాటు చేసి, విజయ నూత న ఉత్పత్తులను వినియోగదారులకు పరిచ యం చేశారు. ఆవు, గేదె నెయ్యిలను కేజీ, అరకేజీ, 200 ఎంఎల్‌, 100 ఎంఎల్‌లలో అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. కేజీ రూ. 650, అర కేజీ రూ. 330, 200 ఎంఎల్‌ రూ.160, 100 ఎంఎల్‌ రూ. 90లకు అన్ని విజయ అవులెట్స్‌, మిల్క్‌ పాయింట్లలో విక్రయిస్తామన్నారు. తొలుత నిర్వహించిన పాలక వర్గ సమావేశంలో పాడి రైతుకు మరింత ఆర్థిక దన్ను ఇచ్చేలా చేపట్టాల్సిన కార్యచరణ గురించి చర్చించామని తెలిపారు. ఎండీ కొల్లి ఈశ్వరబాబు, సమితి డైరెక్టర్లు చలసాని చక్రపాటి, వేమూరి వెంకట సాయి, నెలకుదిటి నాగేశ్వరరావు, నెక్కలపు వాణిశ్రీ, చెరుకూరి లవయ్యలతో పాటు పలువురు ట్రస్ట్‌ డైరెక్టర్లు పాల్గొన్నారు.

4న ‘వెన్ను పోటు దినం’

పామర్రు: కూటమి ప్రభుత్వ విధానాలను ఎండగట్టే విధంగా వైఎస్సార్‌ సీపీ అధిష్టానం ఆదేశాల మేరకు జూన్‌ 4వ తేదీన నిర్వహించే ‘వెన్ను పోటు దినం’ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్‌ అన్నారు. స్థానిక కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద జరిగే నిరసన కార్యక్రమాలలో వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభు త్వ అసమర్థతపై ప్రజా వ్యతిరేకతను తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు ప్రజలకు మాయ మాటలు చెప్పి.. గెలిచాక పథకాలు ఇవ్వకుండా మోసం చేసిన కూటమి ప్రభుత్వ దగాకోరుతనానికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు.

ఆపద వేళ

రిక్తహస్తం..

కూటమి ఏడాది పాలనా కాలంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఉమ్మడి జిల్లాలో పంటలకు అపార నష్టం వాటిల్లింది. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి పెట్టుబడులు కోల్పోయారు. మే మొదట్లో వచ్చిన అకాల వర్షాలకు సైతం అదే నష్టం. చేతికొచ్చిన ధాన్యం, మొక్కజొన్న, మిరప, పత్తి, మామిడి, కూరగాయ పంటలు తుడిచిపెట్టుకు పోయాయి. గతేడాది సెప్టెంబర్‌ వరదల సాయంలో సర్కారు భారీగా కోత విధించి మొక్కుబడిగా సాయం అందించటం తెలిసిందే. ఇక అకాల వర్షాల విషయంలో నష్టపరిహారం ఎంత? ఎప్పుడు ఇస్తారు? అన్నది కూడా స్పష్టత లేక, తమను ఆదుకునే నాఽథుడే కరువయ్యాడంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతు సేవా కేంద్రాల(గతంలో ఆర్బీకేలు) నిర్వహణను గాలికొదిలేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో రూ. 129 కోట్ల అంచనా వ్యయంతో 600 రైతు సేవా కేంద్రాలను చేపట్టింది. వీటిలో దాదాపుగా అన్ని కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే తుది దశ పనుల వద్ద నిలిచి పోయి, నిర్మాణ పనులు పూర్తయ్యి ప్రారంభానికి నోచుకోక రైతు సేవకు దూరంగా ఉంటున్నాయి.

నమ్మించి మోసం..

ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలను ప్రజానీకం విశ్వసించారు. ముఖ్యంగా సకాలంలో ఎరువులు, విత్తనాలు అందిస్తామని, సాగునీరు సమృద్ధిగా అందేలా చూడటంతో పాటుగా పెట్టుబడి సాయం ఏకంగా రూ. 20 వేలు (కేంద్రం ఇచ్చే సొమ్ముతో కలిపి) ఇస్తామని ప్రచారం చేసింది. కానీ ఏడాది కూటమి పాలనలో ఒక్క పైసా అన్నదాత సుఖీభవ కింద రైతు ఖాతాలకు చేరింది లేదు. నమ్మించి నయవంచన చేస్తూ రెండో ఏడాది పాలనకు కూటమి శ్రీకారం చుట్టిందంటూ రైతులు పెదవి విరుస్తున్నారు. సాగుకు భరోసా లేకుండా పోతుందంటూ ఆవేదన చెందుతున్నారు.

బందరు, రైవస్‌తో పాటు బ్యారేజీకి ఎగువున ఉన్న అనేక ప్రధాన కాలువలు, బుడమేరు సహా చానళ్లు తూడు, గుర్రపుడెక్కతో పూడుకుపోయాయి. వేసవిలోనే కాలువ కట్టల పటిష్టం, తూడు, పూడికతీత తొలగింపు పనులు పూర్తి చేయిస్తే ఖరీఫ్‌ నాటికి కాలువలు సిద్ధమయ్యేవి. కానీ హడావుడిగా మొక్కుబడిగా తూడు తొలగింపులకు నిధులు కేటాయింపులు చేయటం, పనులు చేపట్టడం వల్ల కాలువ చివరి భూములకు సాగునీరు ప్రశ్నార్థకమేనని, మొక్కుబడిగా పనులు సాగటం వల్ల ప్రయోజనం ఉండదని రైతులు వాపోతున్నారు.

రైతులకు ఖరీఫ్‌ సీజన్‌కు అవసరమైన విత్తనాలను మే ఆఖరు వస్తున్నా పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేని దుస్థితి నెలకొంది. వేసవిలో భూ సారం పెంపొందించే పచ్చిరొట్ట విత్తనాలు సమృద్ధిగా రైతులకు చేరలేదు. కొన్ని ఆర్‌ఎస్‌కేల్లో పచ్చిరొట్ట విత్తనాలు మూలుగుతున్నాయంటే రైతుల పట్ల ఎంతటి నిర్లక్ష్యం కనబరుస్తున్నారో తేటతెల్లమవుతోంది. ఎరువులు, విత్తనాలు, రైతు సేవల బుకింగ్స్‌ ఆన్‌లైన్‌లో చేపట్టేందుకు అందుబాటులోకి తెచ్చిన కియోస్క్‌లు మరమ్మతులతో మూలన పడ్డాయి.

కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలతో అధికారంలోకి వచ్చింది. రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తామని చెప్పింది. కానీ నేటికీ అండగా నిలిచిందే లేదు. ప్రభుత్వం అందించే విత్తనాలు, బయటి మార్కెట్‌లో విత్తనాలు ధర ఒకే విధంగా ఉన్నాయి. ఇంకా సబ్సిడీ విత్తనాలు అంటూ ప్రచారం చేసుకోవటానికే తప్ప ప్రయోజనం లేదు. భరోసా దక్కక రైతులు సాగుకు వెనుకాడుతున్న పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి.

– కొండవీటి వెంకట సుబ్బారావు, రైతు, మంతెన

ప్రకృతి విరుచుకుపడింది. ప్రభుత్వం మొక్కుబడిగా కాకిలెక్కలు వేసి అరకొరగా సాయం విదిలించింది. అకాల వర్షాలకు చేతికొచ్చిన పంట దెబ్బతిని రైతులు గగ్గోలు పెట్టారు. పరిహారం ఇదిగో అన్నారే కానీ, నేటికీ అందలేదు. అదే జగన్‌ ప్రభుత్వంలో ఏడాదికి రైతు భరోసా రూ.13,500 వచ్చింది. ప్రకృతి విపత్తుతో నష్టపోతే అదే సీజన్‌లో పరిహారంతో పాటుగా పంట ఎలాంటి స్థితిలో ఉన్నా కొనుగోలు చేసి ధైర్యం చెప్పింది. నేడు ఆ పరిస్థితి లేదు.

– బొమ్మారెడ్డి వాసు, రైతు, చలివేంద్రపాలెం

కూటమి ఏడాది పాలనలో రైతులకు ఒరిగిందేమీ లేదు. దళారులు ఎక్కువైపోయారు. ఈ ఏడాది ధాన్యం పండించిన రైతులకు నష్టమే తప్ప లాభం లేదు. క్వింటాకు రూ. 300 నుంచి రూ. 400 వరకూ నష్టపోయాం. వేసవిలో భూమికి బలాన్ని ఇచ్చే పచ్చిరొట్ట విత్తనాలు సాగు చేస్తాం. నేను 30 ఎకరాలకు పైగా సాగు చేస్తాను. నాకు కేవలం 50 కిలోలు విత్తనం ఇచ్చారు. రెండెకరాలకు కూడా సరిపోదు. – నెరుసు నాని, రైతు, ఉప్పలూరు

కూటమి ప్రభుత్వం కౌలు రైతులకు మొండి చేయి చూపుతోంది. నేటి వరకూ కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. రైతుల అంగీకారంతో సంబంధం లేకుండా వాస్తవంగా సాగు చేస్తేనే ఇవ్వమని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశా. కానీ కార్డులు ఇవ్వటం లేదు. మొన్న అకాల వర్షాలకు మొక్కజొన్న పూర్తిగా దెబ్బతింది. కానీ ఆదేశాలు లేవంటూ నష్టం నమోదు చేసేందుకు అధికారులు ముందుకు రాలేదు.

– వి.మరియదాసు, కౌలురైతు, గొడవర్రు

జ్ఞాన సముపార్జనలో గ్రంథాలయాల పాత్ర కీలకం

విజయవాడ కల్చరల్‌: విజ్ఞాన సముపార్జనలో గ్రంథాలయాల పాత్ర కీలకమని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ అన్నారు. గ్రంథాలయ పునర్వికాస వేదిక, విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ, స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ కార్యాలయంలో 10 రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు శుక్రవారం ముగిశాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రంథాలయాలు ఆధునిక దేవాయాలు అని అభివర్ణించారు. ముగింపు సందర్భంగా బాల బాలికలకు నిర్వహించిన పోటీలో గెలుపొందిన వారికి కలెక్టర్‌ జ్ఞాపికలను, ప్రశంస పత్రాలను అందజేశారు. గ్రంథాలయ పునర్వికాసవేదిక నిర్వాహకులు గోళ్ల నారాయణరావు, సవర్ణవెంకటనారాయణ, మనోహర నాయుడు, లక్ష్మయ్య, రహ్మనుద్దీన్‌, నిహారిక, హసీనా తదితరులు పాల్గొన్నారు.

9

నాడు

న్యూస్‌రీల్‌

నేడు

అరకొర సేవలు..

కౌలు రైతులకు మొండిచేయి

రైతులకు భరోసా ఏదీ?

నష్టపోయినా ఆదుకోలేదు..

పచ్చిరొట్టకూ దిక్కులేదు..

ఫిషరీస్‌ కోర్సులో ప్రవేశానికి ఆన్‌లైన్‌ దరఖాస్తులు

భావదేవరపల్లి(నాగాయలంక): ఏపీ మత్స్య విశ్వవిద్యాలయం అందించే ఫిషరీస్‌ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థులు నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండలంలోని భావదేవర పల్లి ఎంవీకేరావు మత్స్య పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎ.చంద్రశేఖరరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి 22ఏళ్ల లోపు, పదో తరగతి దానికి తత్సమానమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే అర్హులని వివరించారు. మే 30 నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ మొదలవుతుందని జూన్‌ 20తో గడువు ముగుస్తుందని పేర్కొన్నారు. ఈ పాలిటెక్నిక్‌ కాలేజీలో చేరేందుకు ప్రవేశ పరీక్షలు ఉండవని, అడ్మిషన్స్‌ సంబంధించి మరి ఏ ఇతర ప్రకటన వెలువడదని తెలిపారు.

దుక్కుల్లో దుఃఖం1
1/19

దుక్కుల్లో దుఃఖం

దుక్కుల్లో దుఃఖం2
2/19

దుక్కుల్లో దుఃఖం

దుక్కుల్లో దుఃఖం3
3/19

దుక్కుల్లో దుఃఖం

దుక్కుల్లో దుఃఖం4
4/19

దుక్కుల్లో దుఃఖం

దుక్కుల్లో దుఃఖం5
5/19

దుక్కుల్లో దుఃఖం

దుక్కుల్లో దుఃఖం6
6/19

దుక్కుల్లో దుఃఖం

దుక్కుల్లో దుఃఖం7
7/19

దుక్కుల్లో దుఃఖం

దుక్కుల్లో దుఃఖం8
8/19

దుక్కుల్లో దుఃఖం

దుక్కుల్లో దుఃఖం9
9/19

దుక్కుల్లో దుఃఖం

దుక్కుల్లో దుఃఖం10
10/19

దుక్కుల్లో దుఃఖం

దుక్కుల్లో దుఃఖం11
11/19

దుక్కుల్లో దుఃఖం

దుక్కుల్లో దుఃఖం12
12/19

దుక్కుల్లో దుఃఖం

దుక్కుల్లో దుఃఖం13
13/19

దుక్కుల్లో దుఃఖం

దుక్కుల్లో దుఃఖం14
14/19

దుక్కుల్లో దుఃఖం

దుక్కుల్లో దుఃఖం15
15/19

దుక్కుల్లో దుఃఖం

దుక్కుల్లో దుఃఖం16
16/19

దుక్కుల్లో దుఃఖం

దుక్కుల్లో దుఃఖం17
17/19

దుక్కుల్లో దుఃఖం

దుక్కుల్లో దుఃఖం18
18/19

దుక్కుల్లో దుఃఖం

దుక్కుల్లో దుఃఖం19
19/19

దుక్కుల్లో దుఃఖం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement